తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షో కి రోజు రోజుకీ ఆదరణ పెరిగిపోతుంది.  కొత్తలో కాస్త బిగ్ బాస్ హౌజ్ లో ఎంట్రీ ఇచ్చిన వారు కాస్త ఇబ్బందులు పడ్డారు..అయితే ప్రోగ్రామ్ పెద్దగా రక్తి కట్టక పోవడంతో ప్రేక్షకులు కూడా కాస్త నిరాశలో ఉన్నారు.  అయితే బిగ్ బాస్ షో అనగానే ప్రతిక్షణం ఎంతో ఉత్కంఠంగా ఉంటుందని..అందులో పాల్గొనే వారి మద్య ఎలాంటి సంభాషలు, సంఘటనలు జరుగుతాయనే క్యూరియాసిటి ఉండేది.
Image result for big boss telugu show
కానీ ఒకటీ రెండు సంఘటనలు మినహా..బిగ్ బాస్ లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకున్న అంశం ఏదీ లేదు. కాకపోతే నిన్న జరిగిన ఎపిసోడ్ లో మాత్రం నటి జ్యోతి ఎలిమినేట్ కావడం కాస్త బాధ కలిగించినా..ప్రోగ్రామ్ పై ఆసక్తిని  పెంచింది.  వాస్తవానికి మొన్న జరిగిన షోలో ఎన్టీఆర్ బిగ్ బాస్ సభ్యులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.  కత్తి మహేష్ ని బ్యాగ్ సర్ధుకోమని చెప్పేసి దాదాపు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు పంపే వారకు టెన్షన్ వాతావరణం సృష్టించారు. దాంతో అందరూ అతని వద్దకు వెళ్లి చాలా బాధపడ్డారు..ముఖ్యంగా ముమైత్ ఖాన్ అయితే ఏడ్వటం మొదలు పెట్టింది.  

అనూహ్యంగా ఎన్టీఆర్ తిరిగి కత్తి మహేష్ ని వెనక్కి పిలిచారు.  నిన్న మాత్రం జ్యోతి ఎలిమినేట్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ నిన్న కొన్ని బిగ్ బాస్ ఇంటి సభ్యులను క్వచ్చన్స్ అడిగారు.  వారికి YES, No అనే ప్ల కార్డు ఇచ్చి..ఒక్కొక్కిరిపై ఒక్కొక్కిరి అభిప్రాయాన్ని అడిగారు.  ఇందులో భాగంగా ప్రిన్స్ ని గోడమిద పిల్లి అనగానే ఎక్కువ మంది YES అన్నారు.  

ఇక మధుప్రియ ప్రస్తుతానిక అంతా సెట్ అయ్యిందా..అంటే YES అని చూపించారు.  ఇక శివబాలాజీ తనపై ఫోకస్ కోసం బిగ్ బాస్ లో రచ్చ రచ్చ చేశారు అన్నదానికి అందరూ No అని చూపించారు. ఇలా ఒక్కోక్కరూ ఒక్కో విధంగా స్పందించగా..ధన్ రాజ్ గురించి అడిగిన వెంటనే అందరూ YES అని చూపించారు.  దీంతో ఎన్టీఆర్ నవ్వుతూ అబ్బో ధన్ రాజు నిజంగా అందరూ నిన్ను భలే ముదురు అని అంటున్నారే అంటూ ప్రోగ్రామ్ ని మరింతక రక్తి కట్టించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: