సినిమాలోని సీన్ లో ఎంత కామెడీగా నటిస్తాడో బయట జీవితంలో అంత ఎమోషనల్ గా ఉంటాడు శివాజీరాజ. ముక్కు సూటీగా మాట్లాడుతాడు అని పేరున్న ఈ నటుడు నటుడుగా కంటే అతడు చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచు మీడియాకు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కొనసాగుతున్న శివాజీరాజతో నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. 

ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం నుండి తన కెరియర్ వరకు ఎన్నో ఆసక్తికర విషయాల పై ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు శివాజీరాజ. సినిమా రంగంలో ఎదగాలి అంటే కెమెరా ముందు నటించడం కంటే కెమెరా వెనుక నటించడం బాగా రావాలి అంటూ అది రానివాడు సినిమా రంగంలో ఎదగలేడు అన్న వాస్తవాన్ని బయట పెట్టాడు శివాజీరాజ.

తన కెరియర్ తొలిరోజులలో అవకాశాలు రానప్పుడు తినడానికి తిండి కూడ లేని పరిస్థితిలో తనకు తమ ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టించిన సాయి కుమార్ , రఘుబాబులు చేసిన సహాయం జీవితంలో మరిచిపోను అని కామెంట్ చేసాడు శివాజీ. నాలుగురోజులు భోజనం చేయకుండా ఉల్లిపాయలు ఉడకపెట్టుకుని తిన్న రోజులు తనకు గుర్తున్నాయి అంటూ సినిమా రంగంలో నిలదొక్కుకోవడం అంత సులువు కాదు అని చెప్పుకొచ్చాడు.

ఇక తాను సినిమాలలో కొంత వరకూ నిలదోక్కుకున్నాక తనకు చిరంజీవి, మోహన్ బాబుల మధ్య జరిగిన గొడవలను గుర్తుకు చేసుకుంటూ ముఖ్యంగా బ్రహ్మానందంతో ఏర్పడ్డ గొడవ గురించి వివరించాడు. తనికెళ్ళ భరణి మల్లిఖార్జునరావు ఇలా కొంతమంది హాస్య నటులతో కలిపి తాను ఏర్పాటు చేసిన ‘బ్రహ్మానందం ఛారిటబుల్ ట్రస్ట్’ వ్యవహారాలలో నిధులు దుర్వినియోగం అయ్యాయని వచ్చిన అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ తాను ముక్కు సూటిగా మాట్లాడుతానని తనను రెచ్చగొట్టి తరువాత చాలామంది హాస్యనటులు తప్పుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

అయితే విషయం దాసరి నారాయణరావు వరకు వెళ్ళడంతో దాసరి తనను మందలించి విషయాన్ని సద్దుబాటు చేసిన విషయాన్ని బయట పెట్టాడు. సామాన్యంగా సినిమాలలో హీరోయిన్స్ చిట్టిపొట్టి బట్టలు వేసుకుని ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉంటారు అన్న విషయం పై స్పందిస్తూ ప్రస్తుతం హైదరాబాద్ లో నడపబడుతున్న చాల పబ్స్ కు వచ్చే అమ్మాయిలు హీరోయిన్స్ కన్నా ఎక్కువ గ్లామర్ గా ఎక్స్ పోజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు అంటూ ప్రపంచంలో జరుగుతున్న అన్ని అన్యాయాలకు సినిమా వాళ్ళనే బలిచేయడం దారుణం అంటున్నాడు శివాజీరాజ..    



మరింత సమాచారం తెలుసుకోండి: