తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి సునామీ సృష్టిస్తున్న డ్రగ్స్ దందా వ్యవహారం, టాలీవుడ్ ని ఒక్క కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఇప్పటికే ప్రముఖ సినీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, శ్యాం కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌, నవ దీప్ సిట్‌ విచారించింది.

అయితే వీరి నుంచి కొన్ని కీలక ఆధారలు..సేకరించిన సిట్ మరికొందరి ప్రమేయం ఉన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.  ఈ రోజు ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా అలియాస్‌ ధర్మారావును విచారించనుంది.  ఉద‌యం 10.30 కు ఎక్సైజ్ కార్యాల‌యంలో చిన్నా విచార‌ణ ప్రారంభం కానుంది. నిన్న న‌టుడు న‌వ‌దీప్ ను సిట్ అధికారులు రాత్రి 9.45 వ‌ర‌కు విచారించారు.
Image result for ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా
ఇప్పటి వరకు హాజరైన నటులు డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చిన నేపథ్యంలో చిన్నా విచారణలో ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సిట్ విచారణకు హాజరైనంత మాత్రాన అందరూ నిందితులే అని భావించడం సమంజసం కాదని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: