సాధారణంగా విమర్శలకు , వివాదాలకీ దూరంగా ఉండే అక్షయ్ కుమార్ ఇప్పుడు అనుకోకుండా ఒక వివాదం లో ఇరుక్కున్నాడు. మూడు రోజుల క్రితం అతని కొత్త సినిమా టాయ్ లెట్ ఏక్ ప్రేమ కథ ఆన్ లైన్ లో లీక్ అవ్వగా దాన్ని ఆన్ లైన్ లోంచి తొలగించే ప్రయత్నం చేసాడు అక్షయ్ .. ఆ పని పూర్తి అయిన తరవాత ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడడం కోసం స్వయంగా తన ఫ్యామిలీ తో కలిసి ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానం కి వెళ్ళాడు అక్షయ్.


అక్కడ వీఐపీ గ్యాలరీ లో కనిపించిన అక్షయ్ కుమార్ అన్ని సందర్భాల్లో ఇండియా ని ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. తన ఫ్యామిలీ తో పాటు తెచ్చుకున్న ఒక త్రివర్ణ పతాకాన్ని అక్షయ్ కుమార్ గాల్లోకి ఎత్తి ప్రేక్షకులతో పాటు ఆటగాళ్ళు అందరికీ సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేసాడు . చాలా సార్లు దాన్ని గాల్లో కి ఎగరేసిన అక్షయ్ దాన్ని రివర్స్ లో పట్టుకున్నాడు అనే విషయం తెలుసుకోలేక పోయాడు.


దీనిపై విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పాడు. కాగా, ఫైనల్ లో ఓటమి అనంతరం నిరాశలో కూరుకుపోయిన మహిళా క్రికెటర్లలో అక్షయ్ కుమార్ ఉత్సాహం నింపాడు. వారితో గడిపి వారిని ఆనందంలో ముంచెత్తాడు. వారు సాధించిన ఘనతకు వారిని అభినందించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: