సినిమా సెలెబ్రెటీలను తమకుటుంబ సభ్యులకంటే ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో అభిమానిస్తూ ఉంటారు. అందువల్లనే మీడియా ఎప్పుడూ వారికి సంబంధించిన వార్తలను వారి అభిమానులకు చేరవేయడంలో పోటీపడుతూ ఉంటుంది. అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రికిచ్చిన అఖిల్ తొలిచిత్రంతోనే పరాభవాన్ని చూసినా అతడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

దీనితో అతడు నటించిన సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతూ ఉన్నా అఖిల్ పట్ల క్రేజ్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒకభారీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున తనసొంత నిర్మాణ సంస్థ పై ఈభారీ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈసినిమా మొదలై చాలాకాలం అవుతున్నా ఈసినిమాకు సంబంధించిన వార్తలు ఫోటోలు బయటకు లీక్ కాకుండా చాలజాగ్రత్తలు తీసుకుంటున్నారు.  అయితే లేటెస్ట్ గా అఖిల్ ఈసినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈఫోటో సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఈఫోటోను ఆధారంగా చేసుకుని కొందరు అఖిల్ కు హెచ్చరికలు కూడ చేస్తున్నారు. ఈఫోటోలో అఖిల్ సరదాగా కెమెరాతో ఈసినిమా షూటింగ్ ను పరిశీలిస్తూ ఈసినిమా యూనిట్ కు కొన్నిసూచనలు ఇస్తున్నాడు. 

ఇప్పుడు ఆవిషయమే అఖిల్ కు తలనొప్పిగా మారింది. అఖిల్ తొలి చిత్రం విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉందని నాగ్ సూచించిన మార్పులతో వివి వినాయక్ కన్ఫ్యూషన్ కు గురయ్యాడనే వార్తలు ఉన్నాయి. అందువలనే చిత్ర అవుట్ ఫుట్ సరిగా రాక ఫెయిల్ అయిందని విమర్శించే వారూ లేకపోలేదు. తాజాగా అఖిల్ పోస్ట్ చేసిన షూటింగ్ స్పాట్ లో స్టిల్ పై కూడా ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. 

డైరెక్టర్ గా విక్రమ్ కుమార్, సినిమా టోగ్రాఫర్ పి ఎస్ వినోద్ ప్రతిభావంతులు వారిపనిని వారిని చేసుకోనివ్వకుండా సినిమా మేకింగ్ లో వేలుపెట్టవద్దని అంటూ కొందరు అభిమానులు అఖిల్ కు సున్నితంగా వార్నింగ్ లు ఇస్తున్నారు.  సాధారణంగా పెద్దపెద్ద హీరోలు మాత్రమే కెమెరా వ్యూ ఫైండర్ లో నుంచి సినిమా షూటింగ్ ఎలాజరుగుతుందో చూస్తుంటారని అటువంటి ప్రయత్నాలు పట్టుమని రెండుసినిమాలు కూడ నటించని అఖిల్ చేయడం అతని కెరియర్ కు ఏమాత్రం శ్రేయస్కరం కాదు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏమైనా అఖిల్ సరదాగా షేర్ చేసిన తన మూవీ షూటింగ్ ఫోటో పెద్ద అలజడినే సృష్టించింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: