డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను దావాలం లా చుట్టేస్తోంది. కేసు లోతులలోకి వెళ్ళేకొద్ది సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. నేడో రేపో మరో నలుగురు సినీ ప్రముఖులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం అయింది అంటూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఈరోజు పతాక శీర్షికలో ఆసక్తికర కథనం ప్రచురించింది.
ఈ లిస్టులో ఇద్దరు ప్రముఖ హీరోలతో పాటు ఒక టాప్ హీరోయిన్ మరో సినీనటి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పత్రిక అందిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం డ్రగ్స్ వినియోగానికి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి హవాలో ఉన్న మూడు కుటుంబాలకు చెందిన వారికి తాజాగా నోటీసులు అందే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆ పత్రిక వ్యక్తం చేసింది.
ఈ రోజు కాని రేపు కాని సిట్ అధికారులు నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు టాక్. ఈ విషయాలను టాలీవుడ్ సినిమా ప్రముఖులు కూడ పరోక్షంగా అంగీకరిస్తున్నారని ఆ పత్రిక కథనం వ్రాసింది. ఈ లిస్టులో కుటుంబ కథలు ఆటపాటలతో ఉర్రూతలు ఊగించే ఒక ప్రముఖ హీరో కూడ ఉన్నట్లు ఆ పత్రిక కథనం.
అంతేకాదు వరుస హిట్లతోదూసుకు పోతున్న టాప్ హీరోయిన్ కూడ ఈ లిస్టులో ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే రాబోయే ఆగష్టు నెల టాలీవుడ్ సినిమా రంగానికి ఒక పీడకల లా మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే ఇంత టెన్షన్ లో కూడ టాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ డ్రగ్స్ కేసు వ్యవహారాల నుండి క్షేమంగా బయట పడటానికి ముహూర్తాలు తెల్లచొక్కాలు లాంటి సెంటిమెంట్ ను నమ్ముకుని ఈ విచారణకు హాజరు అవుతూ ఉండటం టాపిక్ ఆఫ్ డి టాలీవుడ్ గా మారింది. విచారణకు ఏ సమయంలో బయలుదేరాలి ఏ రంగు కారులో వెళ్ళాలి అనే విషయాల పై కూడ సెలెబ్రెటీలకు వారితో సన్నిహితంగా ఉండే జ్యోతిష్కులు సలహాలు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..