పండుగ సీజన్ వచ్చిందంటే కచ్చితంగా తమ అభిమాన హీరో సినిమా బొమ్మ చూడలనే అభిమానుల కోరిక అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకునే క్రమంలో స్టార్స్ అంతా పోటీలో ఉంటారు. ఈ ఇయర్ సంక్రాంతి సినిమాల హంగామా చూశాం అదే తీరున ఎక్కువ రోజులు హాలీడేస్ ఉన్న దసరాకి దుమ్ముదులిపేయడానికి వస్తున్నారు మన హీరోలు.


దసరాకి ముందు టార్గెట్ చేసిన తారక్ :


యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. అసలైతే ఆగష్టు లో సినిమా రిలీజ్ చెయాలని చూశారు కాని ఈ సినిమా సెప్టెంబర్ 21న దసరా బరిలో దిగుతుంది. దసరా బరిలో దిగే అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా జై లవకుశ ఇప్పటికే బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది.


ముఖ్యంగా తారక్ మూడు డిఫరెంట్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందని అభిమానులు ఊహిస్తున్నారు. ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తున్న తొలి సినిమా జై లవకుశ.


మొదటిసారి అన్నదమ్ములిద్దరు కలిసి :


జై లవకుశ సినిమాకు మరో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇన్నాళ్లు బయట సినిమాలు చేసిన తారక్ ఈసారి తన సోదరుడు కళ్యాణ్ రాం నిర్మాణంలో చేస్తుండటమే. అందుకే సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారట. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  


స్పైడర్ సంచలనాలతో మహేష్ :


సూపర్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో స్పైడర్ మూవీ కూడా ఈ దసరా బరిలో దిగుతుంది. సెప్టెంబర్ 27న స్పైడర్ రిలీజ్ కన్ఫాం అంటున్నారు. మహేష్ స్పై ఏజెంట్ గా నటిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాదని చిత్రయూనిట్ చెబుతున్నారు.


ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 130 కోట్ల దాకా పెట్టేశారట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు.


బ్రహ్మోత్సవం నేర్పిన పాఠాలు :


మహేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబోలో వచ్చిన బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయ్యింది. మహేష్ కెరియర్ లో డిజాస్టర్ లలో బ్రహ్మోత్సవం ఒకటి. అయితే ఆ సినిమా ఎఫెక్ట్ స్పైడర్ పై పడకుండా జాగ్రత్త పడుతున్నాడు మహేష్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.


పైసా వసూల్ బాలయ్య :


ఈ దసరాకి పైసా వసూల్ తో తాను కూడా పోటీలో ఉన్నా అంటున్నాడు బాలయ్య బాబు. పూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కొత్తరకం బాలయ్యను చూస్తామని అంటున్నారు. శ్రీయా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

బాలయ్య డాన్ గా కనిపించబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.  


మహేష్, ఎన్.టి.ఆర్, బాలకృష్ణ ఈ ముగ్గురు ఒకేసారి బాక్సాఫీస్ పై ఫైట్ కు సిద్ధమయ్యారు. ఈ ఫైట్ లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. జై టీజర్ తో సంచలనం సృష్టించగా.. స్పైడర్ టీజర్ తో అంచనాలు పెంచాడు. ఇక పైసా వసూల్ కూడా బాగానే ఉండే అవకాశాలున్నాయి. మరి అసలు దసరా బుల్లోడు ఎవరవుతారో చూడాలంటే సినిమాలు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: