ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలు చూస్తుంటే..సోసైటీలో కొంత మంది మరీ ఇంత దిగజారి పోతున్నారా అన్న ఆవేదన కలుగుతుంది. ఆ మద్య సుచి లీక్స్ అంశం టాలీవుడ్, కోలీవుడ్ ని షేక్ చేసింది. ప్రతిరోజు సుచిలీక్స్ ద్వారా లీక్ అవుతున్న ఫోటోలు, వీడియాలు నెట్ లో తెగ హల్ చల్ చేశాయి.
తాజాగా మలయాళ నటి మైథిలీ తన ప్రియుడితో గడిపిన ప్రైవేటు ఫోటోలు లీక్ కావడంతో సోషల్ మీడియాలో హాట్ టాప్ గా మారింది. వివరాల్లోకి వెళితే, మైథిలీకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అయిన కిరణ్ మధ్య 2008లో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం క్రమంగా ఒక బంధానికి దారి తీసింది, ఆ సమయంలోనే కిరణ్ కి అంతకుముందే పెళ్ళి అయిందని మైథిలి కి తెలిసింది.
నిజాలు దాచి పెట్టి మోసగించాడని తెలుసుకొన్న మైథిలీ అతడితో తెగతెంపులు చేసుకొన్నది. మైథిలీ తనకు బ్రేకప్ చెప్పడాన్ని సహించలేని కిరణ్కుమార్ తనపై ఎలాగైనా కక్ష్య తీర్చుకోవాలని అనుకున్నాడు. గతంలో తనతో ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్య కెమెరాలో బంధించిన ఫోటోలను అడ్డు పెట్టుకుని 75 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించేవాడు.
దీంతో ఖంగుతిన్న మైథిలీ ఈ విషయమై పోలీసులకి ఫిర్యాదు చేయగా,వారు వెంటనే కిరణ్ ని అదుపులోకి తీసుకొని ఈ నేరంలో పాల్గొన్న మరికొంతమంది గురించి విచారణ చేపట్టారు. కానీ అప్పటికే కొన్ని ఫోటోలో కిరణ్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ ఘటనతో మరోసారి మలయాల చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.