వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన ఫిదామూవీ జులై 21 న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో మంచి చిత్రాలకు ఎప్పుడు మంచి ఆధరణ ఉంటుందని మరో సారి నిరూపించారు. మంచి ఫ్యామిలీ చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన శేఖర్ కమ్ములు మెగా అబ్బాయి వరుణ్ తేజ్ తో ‘ఫిదా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు చక్కటి లవ్ స్టోరిని తీసుకున్నారు.
ఇక నటుల విషయానికి వస్తే..వరుణ్ తేజ్ చాలా మెచ్యూర్ గా కనిపించగా..సాయి పల్లవి పక్కా మాస్, తెలంగాణ యాసతో అందరి హృదాయలను కొల్లగొట్టింది. రిలీజ్ రోజు నుంచి అన్ని కేంద్రాల్లో హిట్ టాక్ తెచ్చుకున్న ఫిదా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా దుమ్ము రేపుతుంది. తాజా సమాచారం ప్రకారం వారాంతానికే ఈ చిత్రం కలెక్షన్లు టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులుపుతున్నట్టు తెలుస్తున్నది.మొత్తానికి ఫిదా చిత్రంతో వరుణ్ తేజ సూ పర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఫిదా బాక్సాఫీస్ కలెక్షన్లు :
నైజాం : 5.44 Crore
సీడెడ్ : 1.41 Crore
ఉత్తరాంధ్ర : 1.46 Crore
ఈస్ట్ :90.5 Lakhs
వెస్ట్ : 64 Lakhs
కృష్ణ : 79 Lakhs
గుంటూరు :96 Lakhs
నెల్లూరు : 33.5 Lakhs
ఏపీ + నైజాం : 11.94 Crore