తన వైవిధ్యమైన సినిమాలతో తమిళ జనాలకే కాకుండా తెలుగు జనాలకి కూడా హీరో ధనుష్ చాలా సుపరిచితుడు. ఈ కాలం హీరోలలో మంచి నటన, స్క్రిప్ట్ ఎంచుకోవడం , వైవిధ్యమైన కథనం ఉంటేనే సినిమా కి సంతకం పెట్టడం ఇలాంటి లక్షణాలు ఉన్న ఏకైక హీరో అతగాడు. వీఐపీ అంటూ తమిళం లో అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమా కి ఇప్పుడు వీఐపీ 2 అంటూ సీక్వెల్ వచ్చేసింది. వీఐపీ మొదటి భాగం తెలుగులో రఘువరన్ బీటెక్ గా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది.


తెలుగులో ధనుష్ క్రేజ్ ని పెంచిన చిత్రం కూడా అదే కావం విశేషం. ఈ సెకండ్ పార్ట్ కూడా తెలుగులో విడుదల కి ప్లాన్ చేసాడు ధనుష్. ఈ సినిమాకి ఆయనే నిర్మాత కావడంతో, తన పుట్టిన రోజైన ఈ నెల 28వ తేదీన తమిళ .. తెలుగు భాషల్లో విడుదల చేయాలనుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ విషయం లో కాస్తంత లేట్ అవుతూ ఉండడం తో నెమ్మదిగా సినిమా వాయిదా వేసుకున్నారట.


మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ధనుష్ తీసుకున్న నిర్ణయం వెనకాల పోస్ట్ ప్రొడక్షన్ కారణం కాదు అనీ ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కారణం అనీ అంటున్నారు. ఈ సినిమాలో కాజోల్ కీలకమైన పాత్రను పోషించింది. అంతే కాకుండా బాలీవుడ్ జనాలకి హీరోగా ధనుష్ పరిచయమే. అందువలన హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఆగారట .. అదీ సంగతి. 

మరింత సమాచారం తెలుసుకోండి: