డ్రగ్స్ విచారణలో నోటీసులు అందుకున్న ముమైత్ ఖాన్ నేడు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు అయింది. ఉదయం 9.45 గంటల సమయానికి ఆమె సిట్ కార్యాలయానికి చేరుకుంది. నటి ఛార్మి విచారణ సందర్భంగా చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో సిట్ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటంతో పాటు తోపులాట హడావుడి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

బ్లాక్ ఫ్యాంట్ టీ షర్ట్ పుల్ హ్యాండ్స్ తో కూడిన బ్లాక్ జాకెట్ ను ధరించిన ఆమె కళ్లకు గాగుల్స్ పెట్టుకొని పెదాలకు లిప్ స్టిక్ వేసుకోవటంతో పాటు కాస్త మేకప్ తో సిట్ కార్యాలయానికి వచ్చింది. తన చేతుల్ని జాకెట్ జేబుల్లో పెట్టుకొని ఆమె వేగంగా నడుచుకుంటూవెళ్లి పోయిన ఆమె బాడీ లాంగ్వేజ్ చూసిన వారు ముమైత్  కాన్ఫిడెంట్ గా ఉంది అని కామెంట్స్ చేసున్నట్లు టాక్.  ముమైత్ వెంట పలువురు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.  

అయితే మమైత్ సిట్ కార్యాలయంలో గేటు దాటి పై అంతస్తుకు వెళ్లే సమయంలో ముమైత్ తో పాటు పొడుగు వ్యక్తి ఒకరు ఆమె వెంట ఉండటం మీడియా కెమెరాల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆవ్యక్తి ఎవరు అనే విషయంమై భిన్న కధనాలు ప్రచారంలోకి వచ్చాయి.   ఇదిలా ఉండగా  ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో నుంచి ముమైత్ ఖాన్ శాశ్వతంగా వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి.  

దీనితో ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటికొచ్చే సమయంలో ముమైత్‌కు సహచరులు కన్నీటితో వీడ్కోలు పలికారు అని ఒక మీడియా ఛానెల్ ఆసక్తికర కధనాన్ని ప్రసారం చేసింది.  అయితే ముమైత్ ఖాన్ షో నుంచి పర్మినెంట్‌గా తప్పుకోకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ముమైత్ ఖాన్‌తో పాటు సిట్ కార్యాలయానికి  వచ్చిన ఆ పొడుగాటి వ్యక్తి ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులకు సంబంధించిన వ్యక్తి అని  ఆమె ప్రతి కదలికను ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులు గమనిస్తున్నట్లు ఆ ఛానల్ కధనాలు ప్రసారం చేస్తోంది.   

అంతేకాదు  ఆమె తిరిగి పుణె వెళ్లేంత వరకూ ఆమెకు  ఫోన్ కూడా ఇవ్వట్లేదని తెలుస్తోంది. అయితే పూరి బాచ్ తో అతి సన్నిహితంగా ఉండే ముమైత్ దగ్గర నుండి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు పెద్ద హోమ్ వర్క్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: