ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు కోసం ఈసారి మహేష్ అభిమానులు చాల ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం ఆరోజు మహేష్ తన అభిమానులకోసం ఒకేరోజు రెండు గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాడు. ‘స్పైడర్’ సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ తో పాటు అదేరోజు మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘భరత్ అను నేను’ ఫస్ట్ లుక్ ను కూడ విడుదల చేయబోతున్నారు. 

దీనితో మహేష్ అభిమానులు ఆ రెండు గిఫ్ట్స్ కోసం అత్యంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే అదే మహేష్ పుట్టినరోజునాడు మరో మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ సందడి చేయబోతు ఉండటం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్ దర్శకుడు వినాయక్ ల కాంబినేష్ న లో రూపొందింపబడుతున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ ఆరోజే ప్రారంభం కాబోతోంది. 

సాయి ధరమ్ తేజ్ తన కెరియర్ పరంగా కొన్ని విజయాలు ఇప్పటి వరకు అందుకున్నా ఒక టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో ఇప్పటి వరకు నటించిన సందర్భాలు లేవు. ముఖ్యంగా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన వినాయక్ సాయి ధరమ్ తేజ్ తో సినిమాను తీయడం ఇప్పటికే సంచలనంగా మారింది. 

సామాన్యంగా వినాయక్ యంగ్ హీరోలతో సినిమాలు తీయడు. అతడి దృష్టి అంతా టాప్ హీరోల పైనే ఉంటుంది. అయితే ‘ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఏ టాప్ యంగ్ హీరో వినాయక్ పట్ల ఆసక్తి కనపరచక పోవడంతో చివరకు వినాయక్ సాయి ధరమ్ తేజ్ తో సెటిల్ అయ్యాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు టాప్ హీరో ఇమేజ్ ని వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఆది’ సంపాధించి పెట్టింది. అయితే అటువంటి అదృష్టమే తిరిగి తనకు వినాయక్ తో చేస్తున్న ఈ లేటెస్ట్ మూవీతో కలుగుతుందని సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఒకవైపు వినాయక్ సెంటిమెంట్ తో పాటు మహేష్ పుట్టినరోజు సెంటిమెంట్ ను కూడ కలుపుకుని ఈ మెగా యంగ్ హీరో చేస్తున్న ప్రయోగం హిట్ అయితే సాయి ధరమ్ తేజ్ కూడ మంచి కమర్షియల్ హీరోగా మారిపోయే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: