తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ భామ రాధికా ఆప్టే. తెలుగులో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ చిత్రంతో పరిచయం అయిన రాధికా ఆప్టే ఆ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రంతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత బాలకృష్ణ తో ‘లయన్’ చిత్రంలో నటించింది. అంతే కాదు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కబాలి’ చిత్రంతో కూడా నటించింది.
ఎప్పుడూ మీడియాలో కాంట్రవర్సీకి పెద్ద పీట వేసే ఈ అమ్మడు ఆ మద్య తెలుగు ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువ ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు గతంలో ‘పార్చేడ్’ సినిమాలో న్యూడ్ సన్నివేశం గురించి ప్రశ్నిస్తున్న మీడియా ప్రతినిధిపై సిరియస్ అయ్యింది. తాజాగా ఈ అమ్మడు మరోసారి మీడియా ఫోటోగ్రాఫర్లపై ఫైర్ అయ్యింది. అసలు విషయానికి వస్తే.. ఈ అమ్మడు ప్రస్తుతం ‘బజార్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబాయిలో అవుతుంది.
దీంతో విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు వెళ్లింది..ఆ సమయంలో రాధికా ఆప్టే పర్సనల్ మూమెంట్స్పై కెమెరాలను క్లిక్ మనిపించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాధికా ఆప్టే తన అనుమతి లేకుండా ఫోటోలు ఎలా తీస్తారని ఫోటోగ్రాఫర్లపై మండిపడింది. వెంటనే ఆ ఫోటోలు డిటీల్ చేయాల్సిందిగా చెప్పింది.
అంతే కాదు ఈ సినిమాకు సంబంధించిన రాధికా ఆప్టే లుక్ ఇప్పట్లో బయటికి రాకుండా చూడాలని దర్శక నిర్మాతలు బలంగా అనుకున్నారట. గతంలో ‘పార్చేడ్’ సీన్లు కూడా తన ప్రమేయం లేకుండా బయటకు లీక్ అయ్యాయని రాధికా ఆప్టే మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే.