ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్ల హవా కొనసాగుతుంది.  గత కొంత కాలంగా రకూల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, రెజీనా లాంటి హీరోయిన్లు తమ సత్తా చాటుతూ వచ్చాయి..వీరిలో మాత్రం రకూల్ బాగా బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు కూడా తెరపైకి వస్తున్నారు.  మళియాళ భామలు..కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వారు ఒకటీ రెండు సినిమాలతోనే మంచి గుర్తింపు సంపాదించారు.  తెలుగు బుల్లితెరపై ‘ఢీ’ డ్యాన్స్ ప్రోగ్రామ్ తో పరిచయం అయిన ఈ అమ్మడు అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.   
Image result for సాయి పల్లవి
తర్వాత నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ చిత్రంతో కాస్త పేరు సంపాదించినా..శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ కాంబినేషన్ లో వచ్చిన ‘ఫిదా’ చిత్రంలో హీరోయిన్ గా నటించి ఒక్కసారే స్టార్ డమ్ సంపాదించింది.   దీంతో సాయిప‌ల్ల‌వి ఫ్యూచ‌ర్ ఎక్క‌డికో వెళ్లిపోయింది.ఆమెతో తమ సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారట.
Image result for సాయి పల్లవి
అయినా కథల ఎంపికలో తొందర పడకుండా ఆమె ఆచి తూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. ఇక హీరోయిన్ గా మంచి క్రేజ్ వచ్చిందంటే..యాడ్స్ , ఓపెనింగ్స్ అంటూ హీరోయిన్లు బిజీగా ఉంటారు. కానీ సాయి పల్లవి మాత్రం .. డబ్బు కోసం ఇలా చేయడం తనకి ఎంత మాత్రం ఇష్టం ఉండదని చెప్పింది. సామాజిక సేవా కార్యక్రమాలకైతే ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వస్తానని అంది.
Image result for సాయి పల్లవి
ఒక్క సినిమా హిట్టైతే తెల్లారే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వెళ్తున్న ఈ కాలంలో సాయిపల్లవి లాంటి హీరోయిన్లు కూడా ఉంటారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తమకి వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది కథానాయికలు ప్రయత్నిస్తుంటే, సాయిపల్లవి మాత్రం మంచితనంతోను 'ఫిదా' చేస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: