తెలుగు ఇండస్ట్రీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీన 90వ దశకంలో అగ్రహీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది. వివాహం తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా ‘దృశ్యం’ చిత్రంతో వెంకటేష్ సరసన ఇద్దరు ఆడపిల్లలకు తల్లిగా నటించింది. ఈ చిత్రంలో మీనా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ తల్లి పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారని మొదట తడబడిన మీనా ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో గౌరవాన్ని పెంచిందని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తల్లిపాత్రల్లో నటిస్తున్నా మీనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రంలోను ఆమె తల్లి పాత్రను పోషిస్తోందట.
బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది. యాక్షన్, సెంటిమెంట్ తో కూడుకున్న ఈ చిత్రానికి అన్ని కేంద్రాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో మరో యాక్షన్, సెంటిమెంట్ చిత్రంలో నటిస్తున్నాడు బెల్లం కొండ శ్రీనివాస్.
అయితే ఈ చిత్రంలో శ్రీనివాస్ చిన్ననాటి పాత్రలో ఆయన తల్లిగా మీనా అయితే బాగుంటుందని భావంచిన దర్శకులు శ్రీవాస్ ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అంతే కాదు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ కే దాదాపు 3 కోట్లు ఖర్చు చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.