ప్రపంచ వ్యాప్తంగా బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించిన రియాల్టీ షో ‘బిగ్ బాస్’. ఇప్పుడు భారత దేశంలో కూడా తెగ హల్ చల్ చేస్తుంది. ఇక బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఎంతగా పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియాల్టీ షో రేటింగ్ లు ఇతర షోలకు సవాల్ విసురుతున్నాయి. అంతే కాదు ఇప్పటికే 10 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ అక్టోబర్ లో 11వ సీజన్ కూడా ప్రారంభంకాబోతోంది.
ఇప్పుడు బిగ్ బాస్ షో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా వస్తుంది. కాకపోతే బాలీవుడ్ లో వచ్చినంత క్రేజ్ మాత్రం ఇక్కడ రావడం లేదు. అంతే కాదు తమిళనాడులో అయితే మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా నిలుస్తుంది బిగ్ బాస్. తెలుగు లో వివాదాలు దూరంగా ఉంటున్నా..జోష్ ఏ మాత్రం లేదని పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.
ఇక బాలీవుడ్ లో 11వ సీజన్ లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్ల పేర్లతో ఓ లిస్ట్ బయటకు వచ్చినప్పటికీ వీరి పేర్లను బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించలేదు. అంతే కాదు ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సంచలన వార్త కూడా చక్కర్లు కొడుతుంది. 'జమై రాజా' బాలీవుడ్ మూవీలో నటించిన నియా శర్మకు ఈ షోలో కంటెస్ట్ చేయడానికి ఏకంగా రూ. 2 కోట్లు ఆఫర్ చేశారనేది సంచలనంగా మారింది. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం అఫిషియల్ గా తెలియాల్సి ఉంది. అంతే కాదు బాలీవుడ్ బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారి భారీగానే చెల్లిస్తారని టాక్.