నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. గత మూడు సంవత్సరాల నుంచి మనోడు వరుస హిట్స్ తో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు తారక్. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు కథ రెడీ కావడం సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించనున్నట్లు..అందుకోసం డైటింగ్ కూడా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అందరికీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మద్య చంద్రశేఖర్ ఏలేటి చెప్పిన కథ విని చాలా ఇంప్రెస్ అయ్యాడట..వెంటనే ఆ సినిమా చేసేద్దాం అని చెప్పాడట. ఇండస్ట్రీలో చంద్రశేఖర్ మంచి దర్శకుడే కానీ ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ చిత్రం కూడా లేదు..అంతే కాదు భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఇప్పటి వరుకు తీయలేదు.
ఈయన తెరకెక్కించిన సినిమాలు డిజాస్టర్ అవ్వలేదు కానీ సూపర్ హిట్ కాలేకపోయాయి . మరి అలాంటి దర్శకుడి కి ఛాన్స్ అంటే ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనమే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అతని సినిమాకు అంగీకరించడం సాసహంతో కుడి నిర్ణయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.