మూడు పదుల వయసు దాటిపోయినా నయన తార క్రేజ్ ఏమాత్రం తగ్గక పోవడమే కాకుండా ఆమె పారితోషికం 3కోట్ల రేంజ్ లో నడుస్తోంది అంటే నయన్  మ్యానియా  ఏ రేంజ్ లో ఉందొ అర్ధం అవుతుంది.  నిరంతర గాసిప్పుల కు  సంచలన వార్తలకు చిరునామాగా ఉండే నయనతార గురించి ఇప్పటివరకు చాలామందికి తెలియని  విషయాలు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చాయి.

ఈమధ్య ఒక టీవీ షోలో పాల్గొన్న నయనతార తన గురించి కొత్త సంగతులు తెలియచేసి అందరికీ షాక్ ఇచ్చింది. నయన్ కు కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. చిన్నప్పట్నుంచి తనకు ఈ హాబీ ఉందని ఇప్పటికే చాలా కవితలు రాశానని వివిధ అంశాలపై తాను పొయెట్రీ రాస్తుంటానని నయన్ వెల్లడించింది.  అంతేకాదు తనకు ఎప్పుడు ఖాళీ దొరికినా పెన్నూ పేపరు పట్టి కవితలు రాయడం మొదలుపెడతానని అంటూ తనలోని కవయిత్రిని పరిచియంచేసింది నయనతార. 

అదేవిధంగా తాను కొత్తవంటలు చేయడం కూడా ప్రయత్నిస్తుంటానని నయన్ వెల్లడించింది. ఈవిషయాలు అన్నీ నయనతార స్వయంగా చెప్పడంతో ఎవరితోనూ  పెద్దగా  సన్నిహిత  సంబంధాలు కొనసాగించకుండా మీడియాకు దూరంగా ఉండే నయనతారలో ఇంత టాలెంట్ ఉందా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. 

సామాన్యంగా చాలామంది సెలిబ్రిటీలు వంటకాలు ట్రై చేయడం తెలిసిన విషయమే అయినా   కవితలు రాయడం మాత్రం నిజంగా కొత్త విషయమే కాబట్టి ఈ విషయాలను కోలీవుడ్  మీడియా చాలప్రముఖంగా ప్రచారం చేస్తోంది.  అంతేకాదు నయనతార తన కవితల్ని బయటపెడుతూ   పుస్తకరూపంలోకి తీసుకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ కామెంట్స్ కూడ రాస్తోంది.  

ఇది ఇలా ఉండగా  సినిమాల్లో నటించడమే తప్ప ఆ సినిమా  ప్రమోషన్లను పట్టించుకోని నయన తార ఆశ్చర్యకరంగా ‘ఆరమ్' అనే సినిమాను ప్రమోట్ చేస్తోంది. రైతుల నీటి సమస్య పై పోరాడే ఈ సినిమాలో ఒక బ్యూరోక్రాట్ పాత్రను చేస్తోంది నయన్. దీనితో ఈమెకు సామాజిక సమస్యల పై చైతన్యం కూడ బాగా పెరిగిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: