తెలుగు సినిమా పరిశ్రమ కి ఎన్టీఆర్ , ఎన్నార్ తరవాత రెండు కళ్ళు గా ఉంటూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ. వీరిద్దరూ ఎప్పుడైనా అనుకోకుండా, యాద్రుచికంగా ఒకే వేదిక మీద కనిపిస్తే ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ అది.


త్వరలో జయ జానకీ నాయక టీం నందమూరి , ఎగా అభిమానులకి ఇలాంటి పరిస్థితి ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందా ? నిజమే అంటున్నాయి ఫైల్ నగర్ వర్గాలు. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన జయ జానకీ నాయక సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్లు భారీగానే అందుకొంటోంది.


`జ‌య జాన‌కి నాయ‌క‌` థ్యాంక్స్ మీట్‌ని హంస‌ల‌దీవిలో జ‌ర‌పాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది.  ఈ సినిమాలో హంసలదీవి లో తీసిన ఒక సూపర్ హిట్ ఫైట్ సినిమా మొత్తానికీ హై లైట్ గా నిలిచింది మరి ఈ క్రమం లో బాలయ్య - చిరు ల సమక్షం లో ఇక్కడ ఒక  పెద్ద వేడుక చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు.


ఇక్కడ వరకూ రావడానికి వీరిద్దరూ ఇబ్బంది పడితే ఎలాగు తెలంగాణా లో అంటే హైదరాబాద్ లో ఒక స్పెషల్ మీట్ ప్లాన్ చేస్తున్నారు దానికి అయినా ఇద్దరినీ తీసుకుని రావాలనేది బోయపాటి ప్లాన్ . 

మరింత సమాచారం తెలుసుకోండి: