యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చంద్రశేఖర్ యేలేటితో సినిమా కమిట్ అయ్యాడంటూ కొద్దిరోజులుగా వస్తున్న ఫ్రెష్ టాక్. ఈ సినిమా అసలు ఎలా సెట్ అయ్యింది. దీనికి కారణం రాజమౌళి అని అంటున్నారు. చంద్రశేఖర్ యేలేటి, రాజమౌళి దర్శకత్వ శాఖలో పనిచేసిన దగ్గర నుండి స్నేహితులు. చేసే ప్రతి సినిమా ప్రయోగాత్మకంగా ఉండేలా జాగ్రత్తపడే చంద్రశేఖర్ యేలేటి మనమంతా ఫ్లాప్ అయినా సరే ఇప్పుడు మరో పవర్ స్టోరీతో సిద్ధమయ్యాడట. 


ప్రస్తుతం జై లవకుశ షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ ఆ సినిమా తర్వాత త్రివిక్రం తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. చంద్రశేఖర్ యేలేటి కథ లైన్ నచ్చడంతో డెవలెప్ చేసుకుని కనిపించమన్నాడట ఎన్.టి.ఆర్. ఒకవేళ ఎన్.టి.ఆర్ కు నచ్చేలా కథ డెవలెప్ చేస్తే కచ్చితంగా సినిమా షురూ అయినట్టే.  


ఈ సినిమా సెట్ అవడానికి ముఖ్య కారణం దర్శక ధీరుడు రాజమౌళి అని తెలుస్తుంది. తను చెప్పాడనే చంద్రశేఖర్ యేలేటితో స్టోరీ డిస్కషన్ లో కూర్చుకున్నాడట. మొత్తానికి ఎన్.టి.ఆర్ యేలేటి సినిమా ఫిక్స్ అయితే మరో కొత్త ప్రయోగాత్మక సినిమా వచ్చేసినట్టే. అయితే కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేని యేలేటితో ఎన్.టి.ఆర్ సినిమా అంటే రిస్కే అంటున్నారు కొందరు. 


ఫైనల్ గా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. ఇక ఎన్.టి.ఆర్ నటిస్తున్న జై లవ కుశ సెప్టెంబర్ 21న రిలీజ్ అవనుంది. దసరా బరిలో దిగుతున్న ఈ సినిమా మరోసారి ఎన్.టి.ఆర్ సత్తా ఏంటో బాక్సాఫీస్ మీద చూపించాలని వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: