దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగాన్ని షేక్ చేసి 1000 సినిమాలకు పైగా నటించి గిన్నీస్ బుక్ రికార్డులను క్రియేట్ చేసిన బ్రహ్మానందం హవా పూర్తిగా చల్లారి పోవడంతో ప్రస్తుతం ఆయన డేట్స్ గురించి పట్టించుకునే దర్శక నిర్మాతలు బాగా తగ్గిపోయారు. ఈ పరిస్థుతులలో బ్రహ్మానందం స్థానాన్ని పృద్వీ వెన్నెల కిషోర్ లలో ఎవరో ఒకరు ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు అన్న అంచనాలు మొదలు అయ్యాయి.

అయితే బ్రహ్మానందం ఒక అడుగు వెనుకకు వేసినా మరో మూడడుగులు ముందుకు వేసేలా మాష్టర్ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు బ్రహ్మీ తన పారితోషికాన్ని సగానికి సగం తగ్గించుకున్నట్లు టాక్. దీనికితోడు బ్రహ్మీ తనకు సన్నిహితులైన చాలామంది ప్రముఖ దర్శక నిర్మాతలతో కాంటాక్ట్ లోకి వస్తూ తాను పారితోషికం తగ్గించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బ్రహ్మనందం కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎమ్.ఎల్.ఎ’ మూవీలో ఒక కీలక హాస్య పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీనువైట్ల దగ్గర సహాయకుడుగా పనిచేసిన ఉపేంద్ర దర్శకత్వంలో ఈసినిమాను తీస్తున్నారు. ఈ మూవీలో బ్రహ్మానందం డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో నవ్వించబోతున్నాడని టాక్. 

అదేవిధంగా మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో కూడ బ్రహ్మానందంకు ఒక మంచి వెరైటీ రోల్ క్రియేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలలోను నటిస్తున్న బ్రహ్మానందం తన పారితోషికాన్ని బాగా తగ్గించు కోవడమే కాకుండా ఆసినిమాలలోని తన పాత్ర మెప్పు కోసం తెగ కష్ట పడుతున్నాడని టాక్. 

బ్రహ్మీ ఊహించుకున్న విధంగా ఈరెండు సినిమాలు విజయం సాధిస్తే తిరిగి బ్రహ్మీ టాప్ బిజీ కమెడియన్ గా మారిపోయే ఆస్కారం ఉంది. ఈ వార్తలే నిజం అయితే టాలీవుడ్ టాప్ కమెడియన్ స్థానాన్ని ఆశిస్తున్న వెన్నెల కిషోర్ పృధ్వీలకు ఊహించని షాక్ అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: