తెలుగు బుల్లితెరపై వస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికి నాలుగు వారాలు పూర్తి కావొచ్చింది. అయితే బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇప్పటి వరకు జ్యోతి, మధు ప్రియ,సమీర్, కత్తి మహేష్, కల్పన ఎలిమినేట్ అయ్యారు.  ఇక సంపూర్ణేష్ బాబు మాత్రం తన మానసిక పరిస్థితి బాగాలేదని..అక్కడ ఉండలేక పోతున్నానని మద్యలోనే వెళ్లిపోయాడు.  ఆయన స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో అందాల భామ దీక్షా పంత్ ఎంట్రీ ఇచ్చింది.  

గత వారం డబుల్ ధమాకా తో కత్తి మహేష్, సింగర్ కల్పన ఎలిమినేట్ అయ్యారు.  వీరి స్థానంలో మరోవైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హీరో నవదీప్ ఎంట్రీ ఇచ్చాడు.  అయితే ఈ వారం నవదీప్, దీక్షా పంత్ ఎలిమినేట్ కాకుండా ఉండటానికి బిగ్ బాస్ వీరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు.  బిగ్ బాస్ హౌజ్ లో వీరిద్దరూ స్పెషల్ గెస్ట్ లుగ వ్యవహరిస్తారు..మిగతా వారు బిగ్ బాస్ హౌజ్ ని హోటల్ గా ట్రీట్ చేయాలి.  అంతే కాదు వీరిద్దరికి ఏది అడిగితే అది చేయాల్సి ఉంటుంది.  దీంతో రెండు రోజుల నుంచి దీక్షా, నవదీప్ బిగ్ బాస్ సభ్యులతో ఒక్క ఆట ఆడుకుంటున్నారు.  

దీక్ష శివబాలాజీ పింక్ టవల్ కట్టుకొని తనకు తాయ్ మసాజ్ చేయాలని చెబుతుంది. తప్పని పరిస్థితుల్లో బాలాజీ ఆ టాస్క్ కి ఒప్పుకుంటాడు. ఇదంతా ఒక ఎత్తైతే నిన్న బాత్ రూమ్ లో వాటర్ రెడ్ కలర్ లో రావడంతో శివబాలాజీ, ధన్ రాజ్ లు బిగ్ బాస్ పై అసహనం ప్రకటించారు. అంతే కాదు శివబాలాజీ అయితే బిగ్ బాస్ ని ఈడియట్ మీ పని మమ్మల్ని చూసుకోవడానికి..పిచ్చిగా ఉందా అన్నారు.

ఈ నీళ్లతో ఎవరైనా స్నానాలు చేస్తారా..తాగుతారా..బుద్దుందా అని బాగా తిట్టారు. అంతే కాదు కంటెస్టంట్ రూమ్ కి తనను పిలవాలని తాను బిగ్ బాస్ తో మాట్లాడాలని అన్నారు.  ఇక ధన్ రాజ్ మేం ప్రస్తుతం టాస్క్ లో ఉన్నామని లేకుండా మా రియాక్షన్ వేరేలా ఉండేదని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: