నందమూరి బాలయ్య వయసు ఎంత పెరిగినా ఆయనలో చలాకీ తనం , ఎనర్జీ ఇలాంటి వాటికి అసలు కొదవే లేదు. బోలెడంత కామెడీ పుట్టిస్తూ అదే టైం లో సీరియస్ వార్నింగ్ లు ఇవ్వడం బాలయ్య స్పీచ్ ల స్పెషల్ ధమాకా .


పైసా వసూల్ ఆడియో వేడుక లో బాలయ్య తనదైన శైలి లో రెచ్చిపోయారు. నంద్యాల ఉప ఎన్నిక హడావిడి లో ఉన్న బాలకృష్ణ ఈ ఎన్నిక కోసం స్పీచ్ లు ఇచ్చీ ఇచ్చీ అలసిపోయారు.


గొంతు కూడా పూర్తిగా బొంగురు పోయింది. కానీ తన ఫాన్స్ కోసం ఈ వేడుకలో మాట్లాడడం మానలేదు బాలయ్య. పైసా వసూల్ ఆడియో వేడుకలో ఆయన స్పీచ్ అతిపెద్ద హై లైట్ గా నిలిచింది.


శివ శంకరీ అనే పాట గురించి చెప్పుకొచ్చిన బాలయ్య బాబు ఈ పాటని తన సినిమాల్లో పాడాలి అనుకున్నాడట." ఆ పాట మీద ప్రేమ అలాగే ఉంది ఇలోగా ఈ సినిమా కోసం ఒక పాట పాడేసాను. హుషారుగా ఒకే ఒక్క గంటలో ఈ పాట పూర్తి చేశా. ఈ పాటని ఏదో శివ శంకరీ రేంజ్ లో ఊహించుకుని పడేసా " అంటూ చెప్పుకొచ్చారు ఆయన. శ్రియ ని కూడా ఈ సినిమాలోకి తీసుకోవడం వెనకాల తన ప్రమేయం ఉంది అనీ గౌతమీ పుత్ర శాతకర్ణి టైం లోనే ఆమెకి మాట ఇచ్చా అని బాలయ్య అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: