నందమూరి బాలకృష్ణ హీరోగా క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్. సెప్టెంబర్ 1న రిలీజ్ అవనున్న ఈ సినిమా ఆడియో రీసెంట్ గా ఖమ్మంలో రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో వేడుకలో సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. 


పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తున్న ఈ ట్రైలర్ లో డైలాగులైతే బాగున్నాయి కాని బాలయ్య వాయిస్ మాత్రం దెబ్బకొట్టేస్తుంది. టీజర్ అప్పుడే అన్నా రెండు బాల్కాని టికెట్లు ఇవ్వు అన్న డైలాగ్ వినే బాలయ్య వాయిస్ పై డౌట్ పడ్డారు. ఇప్పుడు ట్రైలర్ లో బాలయ్య వాయిస్ క్లియర్ గా తెలుస్తుంది. ఏదో గంభీరం మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది.


స్టైల్ మార్చడం కోసం ఇలా ట్రై చేశారా ఏంటి అన్న ఆలోచన వస్తున్నా.. బాలయ్య బేస్ వాయిస్ పోయి ఏదో పీచు గొంతులా ఉండటం కాస్త నిరాశ కలిగిస్తుంది. సినిమాలో డాన్ గా కనిపిస్తున్న బాలకృష్ణ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. శ్రీయా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కైరా దత్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.


మరి టీజర్ ట్రైలర్ లో కావాలని అలా పెట్టి సినిమాలో వాయిస్ క్లియర్ చేస్తారేమో చూడాలి. తేడా సింగ్ అంటూ తేడా వాయిస్ తో వచ్చిన బాలయ్య ట్రైలర్ ఫ్యాన్స్ ను ఖుషి చేసేలా ఉన్నా సిని లవర్స్ కు మాత్రం అసంతృప్తిని కలిగిస్తుంది. మరి ఈ విషయంపై మరోసారి చిత్రయూనిట్ క్లారిటీ తెచ్చుకుంటే మంచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: