వివాదాలతో కాపురం చేసే రామ్ గోపాల్ వర్మ ఈ సారి ఏకంగా మలయాళ సూపర్ స్టార్ ల మీద పడ్డాడు. ఈయనకి తెల్లారితే ఎవరో ఒకరిని ఏడిపించడం, ఎవరో ఒకరితో గిల్లి కజ్జాలు పెట్టుకోకపోతే నిద్ర పట్టదు.


మళ్ళీ మళ్ళీ కెలికి మరీ తిట్టించుకోవడం భలే సరదా ఆయనకి. తాజాగా కేరళ లో సన్నీ లియాన్ కి వచ్చిన విశేష స్పందన ఫోటోలో మీరు కూడా ఇంటర్నెట్ లో చూసే ఉంటారు.


ఈ ఫోటోలని పట్టుకున్న వర్మ వాటితో పాటు పోస్టింగ్ చేసి మరీ మమ్ముట్టి, మోహన్ లాల్ ల మీద తీవ్ర కామెంట్ లు చేసాడు. " ఈ ఫోటో చూసి , సన్నీ విశేష స్పందన చూసి మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ ఆఫ్ కేరళ వాళ్ళు కుళ్లిపోయి ఉంటారు.


ఈ ఫోటో చూసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు .. " అంటూ ఫేస్బుక్ లో కామెంట్ పెట్టాడు. ఓ కార్యక్రమానికి సంబంధించి సన్నీలియోన్ ఇటీవల కేరళకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అక్కడి జనాలు ఎగబడ్డారు. ఇసుక వేస్తే రాలనంతగా వచ్చిన అభిమానులతో రోడ్డు కిక్కిరిసిపోయింది.ఆ ఫోటో ఇంటర్నెట్ లో చాలా పెద్ద ఫేమస్ అయ్యింది కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: