రామ్ చరణ్ కు మగధీర లాంటి బ్లాకు బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత మెగా ఫ్యామిలీ కి రాజమౌళికి మధ్య చిన్న  గ్యాప్ లు ఏర్పడ్డాయి అన్న గాసిప్పులు ఎప్పటి  నుంచో ఉన్నాయి . అయితే ఆ వార్తలు అన్ని గాలి వార్తలు అని తెలియ చెప్పే విధం గా రాజమౌళి చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి  మూవీ ని ప్రమోట్ చేయడానికి ముందుకు రాబోతున్నాడు అంటూ వార్తలు  హడావిడి చేస్తున్నాయి .

 ఇప్పటికే  ఈ మూవీ పూజ కార్యక్రమాలు కుడా పూర్తి చేసుకున్న  విషయం తెలిసిందే . ఈ సినిమాకు సంభందించి మెగా ఫ్యామిలీ చాలా కామ్ గా ఇటీవలే హోమాలు, పూజులు జరిపించి   సింపుల్ గా పూజ కార్యక్రమాలు కుడా నిర్వహించారు . ఇక ఇక్కడి తో ఆగకుండా  చిరు బర్త్ డే నాడు  ఈ సినిమా టైటిల్ లోగో లుక్ విడుదల చేయడానికి చాలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమాకు మహావీర్  అన్న టైటిల్  ను నిర్ణయించిన నేపధ్యం లో  ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ ఫోస్టర్ విడుదలకు చిరు బర్త్ నాడు  అత్యంత భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ పోస్టర్ ను   రాజమౌళి విడుదల  చేస్తాడని తెలుస్తోంది . ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోయినా ఈ ప్రాజెక్టుకు  ఇప్పటి నుంచే మాగ్జిమమ్ హైప్ తీసుకు వచ్చి భారీ బిజినెస్ చేయడానికి ఈహడావిడి అని అంటున్నారు.
 
చిరంజీవి  కెరియర్ లో ఇప్పటివరకు  దేశభక్తి  కి సంభందించిన సినిమాలు ఏమే చేయని  నేపధ్యం లో  ఉయ్యాలవాడ కథను జాతీయస్థాయి సినిమాగామార్చాలని మెగా కాంపౌండ్ భారీ స్కెచ్ లు వేస్తోంది అని  టాక్ .  తెలుస్తున్న సమాచారం మేరకు   తెలుగు లో బాహుబలి తరువాత ఆ స్థాయి లో ఈ మూవీ కి భారీ బడ్జెట్ తో తీస్తున్న   నేపధ్యం లో    ఈ మూవీ కి  భారీ క్రేజ్ తీసుకు రావాలి అంటే  ఈ మూవీ కి క్రేజ్   తీసుకు రావడానికి  ఈ సినిమాను అన్ని విషయాలలో భారీ  మూవీ గా రూపొందిస్తున్నారు .
 
ఇప్పటికే ఈ  మూవీ కి  సంగీత దర్శకుడిగా  రెహమాన్  ఎంపిక పక్కాఅయిందని సమాచారం .  ఒక హీరోయిన్ గా నయనతార ఓకె అయి నప్పటి కీ మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ తో చర్చలు సాగుతున్నాయి.   ఏది  ఏమైనా బాహుబలి తో నేషనల్  సెలెబ్రిటీ గా మారి పోయిన రాజమౌళి మరో జాతీయ స్థాయి రేంజ్ కి చేరుకోబోయే సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు అనుకోవాలి .



మరింత సమాచారం తెలుసుకోండి: