బెల్లం కొండ సాయి శ్రీనివాస్ , రకుల్ ప్రీత్ ల సినిమా జయ జానకి నాయక సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో ఈ సినిమా సక్సెస్ మీట్ ని కృష్ణా జిల్లా హంసలదీవి లో గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఈ ప్రోగ్రాం కి స్పెషల్ గెస్ట్ గా అక్కడి ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ వచ్చారు.


బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మాస్ జనాలకి విపరీతంగా నచ్చేసింది .. పెద్దగా ప్రమోషన్ లూ థియేటర్ లు లేకపోయినా దాదాపు 15 కోట్ల వసూళ్లు లాగిన ఈ చిత్రం కలక్షన్ లతో హ్యాపీగా ఉంది.


హంసలదీవి లో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఈ సినిమా విలన్ జగపతి బాబు ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ గురించి ముందుగా ప్రస్తావించారు.


చాలా రోజుల తర్వాత ఒక జెంటిల్‌మెన్‌ను చూశానని ఆయ‌న అన్నారు. అందరు ఎమ్మెల్యేలూ ఇలాగే ఉంటే బాగుంటుందని జగపతి చెప్పడం విశేషం 

మరింత సమాచారం తెలుసుకోండి: