తెలుగు ఇండస్ట్రీలో ‘యమదొంగ’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు వారందరి మనసు దోచిన మళియాళ ముద్దుగుమ్మ ప్రియమణి.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.  తాజాగా ఈ అమ్మడు కోరుకున్న ప్రియుడితో వివాహం జరగబోతుంది.  వెడ్డింగ్ సెర్మనీ మూడు రోజుల పాటు జరుగబోతోంది. మొహందీ, సంగీత్, కాక్ టెయిల్ పార్టీ, రిసెప్షన్ వేడుక ఒకదాని వెనక ఒకటి జరుగనున్నాయి.
సహజీవనం
ఇప్పటికే సినిమాలకు వీలైనంత దూరంగా ఉంటున్న ప్రియమణి పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలు మానేస్తుందని సమాచారం.  2016 మే 27వ తేదీన ప్రియమణి-ముస్తఫా రాజ్ ఎంగేజ్మెంట్ జరిగింది.  వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రియమణికి ఆమె జాతకం అడ్డు వచ్చిందట. జ్యోతిష్యాన్ని బాగా నమ్మే రెండు కుటుంబాలు ప్రియమణి జాతకం ప్రకారం ఒక ఏడాది పాటు పెళ్లిని వాయిదా వేశాయట.
ప్రియమణి
మూడేళ్ల ప్రేమాయణం తర్వాత రెండు కుటంబాల అనుమతితో ఆగస్టు 23న పెళ్లి చేసుకోనున్నారు. ప్రైవేట్ వేడుకగా జరగనున్న ఈ పెళ్లి వేడుక సందడి మొదలైంది. ఈవెంట్ మెనెజ్మెంట్ బిజినెస్ రంగం లో ఉన్న ముస్తఫా ఐపీఎల్ మ్యాచ్ లో ప్రియమణి కి పరిచయం అయ్యాడు. గత ఐదేళ్లుగా ప్రియమణి-ముస్తఫా రాజ్ ప్రేమించుకుంటున్నారు.
Image result for priyamani
ముస్తఫా రాజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఓసారి ఐపీఎల్ మ్యాచ్‌లో ముస్తఫా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఎంగేజ్మెంట్ తర్వాత నుండి ప్రియమణి-ముస్తఫా రాజ్ కలిసే ఉంటున్నారని, అఫీషియల్‌గా పెళ్లి జరుగడం తప్ప సంవత్సర కాలంగా దాదాపుగా భార్య భర్తల్లానే జీవిస్తున్నారని టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: