సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ తర్వాత చేస్తున్న సినిమా భరత్ అను నేను. శ్రీమంతుడు తర్వాత మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ కోసం లక్నో వెళ్లారట. గొప్ప చరిత్ర కలిగిన ఆ ప్రదేశంలో షూటింగ్ కోసం అక్కడి ప్రదేశాలను చిత్రీకరించాల్సి ఉందట.


అయితే ఈ చిత్రయూనిట్ కు అర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు అభ్యంతరం వ్యక్తం చేశారట. పురాతన కట్టడాల వద్ద షూటింగ్ చేయవద్దని ఆంక్షలు విధించారట. షూటింగ్ టైంలో వాటికి ఏదైనా జరిగితే కష్టమని అందుకే అక్కడ షూటింగ్ నిలిపివేశారట. లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని వెళ్లిన మహేష్ అండ్ టీం వెనక్కి వచ్చేశారట.


చిత్రయూనిట్ మాత్రం సినిమా అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుందని చెబుతున్నారు. సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తాడని తెలిసిందే. కమర్షియల్ సినిమాలనే సోషల్ మెసేజ్ ఇస్తూ చెప్పే కొరటాల శివ భరత్ అను నేను మూవీని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది.  

మహేష్ పక్కన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2018 సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా శ్రీమంతుడుని మించి సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు మహేష్. 



మరింత సమాచారం తెలుసుకోండి: