టాప్ హీరోల అభిమానులు తమ హీరోలను ఆరాధిస్తూ చేసే పనులకు సంబంధించి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు ఎన్నోసార్లు బయట పడ్డాయి.  దీనికితోడు టాప్ హీరోల ఫంక్షన్స్ కు సంబంధించి కొన్నికొన్ని సంఘటనలు భారీ ఎత్తున సంచలనాన్ని ఎలా సృష్టిస్తాయో అదే స్థాయిలో నవ్వు కూడా తెప్పిస్తాయి.

ఇప్పడు అటువంటి విషయమే కాస్త లేట్ గా బయటకు వచ్చింది. ఇది   ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాకపోయినా ఈ సంఘటన గురించి తెలిసినవారు తెగ నవ్వుకుంటున్నారు. ఈ సంఘటన ‘పైసా వసూల్’ ఆడియో వేడుకలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఖమ్మంలో జరిగిన ఈ వేడుకకు అత్యంత భారీ స్థాయిల్ బాలకృష్ణ అభిమానులు వచ్చారు. 

దీనికి స్థానికులే కాకుండా విజయవాడ కృష్ణాజిల్లాల నుంచి కూడా నందమూరి అభిమానులు విపరీతంగా వచ్చారు. ఈ ఫంక్షన్ ను చూసిన బాలయ్య తన అభిమానుల భారీ రెస్పాన్స్ ను చూసి తట్టుకోలేక పోయినట్లుగానే అదేరోజు వర్షం కూడ బాలకృష్ణ పై తన ఆనందాన్ని వ్యక్త పరిచింది. 

ఈ వేడుక ప్రారంభం నుంచే వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీనితో కార్యక్రమం ప్రారంభానికి ముందు బాగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓపెన్ స్టేడియం కావడంతో నిర్వాహకులు వర్షం ఆగుతుందేమోనని కార్యక్రమాన్నికొద్ది సేపు కార్యక్రమాన్ని వాయిదా కూడా వేశారు. అయితే  పూర్తిగా ఎక్కడా వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ కార్యక్రమానికి వచ్చిన బాలయ్య అభిమానులు తాము కూర్చోవడానికి ఏర్పాటు చేసిన కుర్చీలనే గొడుగులుగా మార్చుకుని నిలబడి ఆ ఫంక్షన్ మొత్తం జై బాలయ్యా జైజై బాలయ్యా అంటూ నినాదాలు చేసారు. 

అయితే ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక చాలామంది వర్షానికి అడ్డుగా పెట్టుకున్న ఆ కుర్చీలను అలానే పట్టుకుని వెళ్లిపోయారట అది ఓపెన్ గ్రౌండ్ కావడం మరోపక్క వర్షం వస్తుండడంతో వారిని నిలువరించే ప్రయత్నం ఎవరూ చేయలేకపోయారని టాక్. దీనితో దాదాపు10 వేలకు పైగా కుర్చీలు మాయమయ్యాయని ఈ ఫంక్షన్ నిర్వహకులు గగ్గోలు పెట్టినట్లు ఒక కథనాన్ని ఒక ప్రముఖ ఛానల్ అత్యంత ఆసక్తికరంగా ప్రసారం చేసింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: