కోట్లాది మంది అభిమానులను పొందిన చిరంజీవిని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేయడానికి చాలా ధైర్యం ఉండాలి అయితే అటువంటి సాహసం దర్శకుడు పూరి జగన్నాథ్ తన ‘పైసా వసూల్’ సినిమాలో చేసాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇప్పుడు ఈ న్యూస్ ఫిలింనగర్ లో హాట్ గాసిప్ గా మారింది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మెగా పంచ్ లు బాలకృష్ణ చేత కాకుండా ఈసినిమాలో మరో కీలక పాత్ర చేస్తున్న అలీ చేత పూరి వేయించినట్లు టాక్ గతంలో పూరితో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాను చేస్తారని ముందుగా ప్రకటించినా తరువాత ఆసినిమాను కథ నచ్చక వదులుకున్న విషయం తెలిసిందే. దీనితో మనస్తాపం చెందిన పూరి తన అసహనాన్ని ఈ పంచ్ డైలాగుల ద్వారా ఇప్పుడు అన్యాపదేశంగా తెలియచేసాడు అన్న గాసిప్పులు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా 'పైసా వ‌సూల్' లో బాలకృష్ణ చెప్పిన డైలాగులు అతడి హీరోయిజాన్ని విపరీతంగా ఎలివేట్ చేస్తున్నాయి. దీనితో ఈసినిమా విడుదల గురించి అత్యంత ఆశక్తిగా బాలయ్య అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఆడియో ఫంక్ష‌న్ లో పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాలోని డైలాగ్ లు మొత్తం ఓ సీడీకి స‌రిపోతాయ‌ని కాన్ఫిడెంట్ గా చెప్పడం బాలయ్య అభిమానుల అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. 

ప్రస్తుతం ఈసినిమా థియేట్రికల్ ట్రైలర్ కు వస్తున్న స్పందన అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా ఈమూవీ బాలకృష్ణ కెరియర్ లో రికార్డుల కలక్షన్స్ ను తెచ్చి పెడుతుందా అన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ట్రైలర్ లోని పూరీ మార్క్ డైలాగులు బాలకృష్ణ తన ఎనర్జీతో చెప్పడంతో అప్పుడే ఈ ట్రైలర్ కు 50 లక్షల వ్యూస్ దాటిపోవడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: