మొన్న మొన్నటి వరకూ జైల్లో ఉండి తాజాగా బయటకి వచ్చిన సంజయ్ దత్ ఇప్పుడు భూమి అనే కొత్త సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.


భూమి అనే ఈ చిత్రం తండ్రీ కూతుళ్ళ అనుబంధానికి సంబందించింది. తన కూతురుని ఇబ్బంది పెట్టినవారిని అంతం ఒందించడమే ఆ తండ్రి ప్రధాన లక్ష్యంగా సాగే ఈ సినిమా మీద చాలానే అంచనాలు ఉన్నాయి.


ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ పరిస్థితి లో సంజయ్ దత్ మరొక తెలుగు సినిమా మీద కన్నేశాడు అంటున్నారు. సాయి కుమార్ హీరోగా ప్రస్తానం అనే తెలుగు సినిమా దేవకట్ట దర్సకత్వం లో చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యింది.


కానీ ఆ సినిమా కమర్షియల్ గా పెద్దాగా ఆడలేదు. క్రిటిక్స్ నుంచి అద్భుతమైన అప్లాజ్ మాత్రం ఇప్పటికీ  వినిపిస్తోంది ఈ చిత్రానికి. ఈ సినిమాని కంటెంట్ పరంగా మెచ్చుకున్న సంజూ హిందీ లో రీమేక్ చెయ్యాలని చూస్తున్నాడు. డైరెక్టర్ గా కూడా తెలుగు డైరెక్టర్ దేవకట్ట నే పెట్టుకోవాలి అని చూస్తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: