తెలుగు బుల్లితెరపై  ప్రపంచ పాపులారిటీ షో బిగ్‌బాస్ 36 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 37వ ఎపిసోడ్‌కి ఎంటరయ్యింది.  ఇక శని, ఆదివారాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సందడితో ఈ షో కి మరింత ఉత్సాహం వస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఈ బిగ్ బాస్ షో లో చిత్ర విచిత్రమైన టాస్క్ లు ఇవ్వడం కంటెస్టంట్ల మద్య  కొన్ని వివాదాలు తలెత్తడం చూస్తుంటే...బిగ్ బాస్ షో పై ఆసక్తి కలుగుతుంది.  మొన్నటి ఎలిమినేషన్ రౌండ్ లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి సూట్కేస్ సర్ధుకొని బయటకు రావడం..అంతలోనే ముమైత్ కు ఎన్టీఆర్ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది.

 ప్రస్తుతం ముమైత్ ఖాన్ సీక్రెట్ రూమ్ లో ఉంటూ బిగ్ బాస్ హౌజ్ సభ్యులు చేస్తున్నది మొత్తం చూస్తుంది.  మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కుటుంబ సభ్యులకోసం ముమైత్ ఏమనుకుంటున్నారో ఒక్కమాటలో రాసి టీషర్ట్ పంపించారని.. వాటిని కుటుంబ సభ్యులు ధరించాలని, ముమైత్ వ్యాఖ్యతో ఏకీభవించని వాళ్లు వాటిని చింపేయవచ్చాన్నారు బిగ్ బాస్. ముఖ్యంగా ధనరాజ్‌ను ఉద్దేశించి స్టుపిడ్ అని రాసి టీషర్ట్ పంపించడం దాన్ని ముమైత్ గుర్తుగా ధనరాజ్ ధరించడం ఆకట్టుకుంది.

బిగ్‌బాస్ ఇందుకోసం హౌస్‌లో ఉన్న సెలబ్రిటీలు ఒక్కొక్కరూ ఇద్దరిద్దరు పేర్లు చెప్తూ వారి మెడలో మిరపకాయల దండను వారి మెడలో వేయాలంటూ.. బిగ్ బాస్ చెప్పడం జరిగింది.  ఈ ఎలిమినేషన్ లో అత్యధికంగా 8 ఓట్లు అర్చనకు రాగా.. శివబాలాజీ 6 ఓట్లు వచ్చాయి. ఇక కన్టెస్టెంట్స్ మిర్చీ నామినేషన్‌ ముగిసిన అనంతరం ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో అర్చన, శివబాలాజీ, ధనరాజ్, కత్తి కార్తీక నామినేట్ అయినట్లుగా బిగ్‌బాస్ ప్రకటించారు.

తర్వాత అర్చన గార్డెన్ లోకి వచ్చి తనను  అందరూ కావాలనే టార్గెట్ చేసి ప్రతిసారీ నామినేట్ చేస్తున్నారంటూ బాగా ఎమోషన్ అయ్యి కన్నీరు పెట్టుకుంది అర్చన.  తాను జాలీగా ఉంటానని ఎవ్వరి జోలికి వెళ్లనని అయినా ప్రతి ఒక్కరూ నన్నే టార్గెట్ చేయడం ఎంత వరకు న్యాయం అని కన్నీరు మున్నీరు అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: