తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో సాగుతున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’. హాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ షో భారత దేశంలో మొదటి సారిగా బాలీవుడ్ లోకి తీసుకు వచ్చారు. ఇప్పటికే అక్కడ పది సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ షో కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తమిళ, కన్నడ భాషల్లో కమల్ హాసన్, కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొట్టమొదటి సారిగా బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ రియాల్టీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
మొదట్లో ఈ షో పై పెద్దగా ఆసక్తి కలగక పోయినా..శని, ఆదివారాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సందడికి ఒక్కసారే టీఆర్ పీ రేటింగ్ కూడా పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి వారానికి ఒక్కరు ఎలిమినేట్ అవుతుండటం..కాస్త ఉత్కంఠ రేపుతుంది. అంతే కాదు బిగ్ బాస్ కంటెస్టంట్స్ కి ఇస్తున్న టాస్క్ లు కూడా చాలా ఫన్నీగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది.
బిగ్ బాస్ హౌజ్ లోకి ఈ మద్య సెలబ్రెటీల ఎంట్రీ కూడా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి చిత్రం ప్రమోషన్ కోసం రానా ఎంట్రీ ఇవ్వగా ఆనందో బ్రహ్మ చిత్రం కోసం తాప్సీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్ కోసం దేవరకొండ విజయ్ బిగ్ బాస్ టీమ్ తో సందడి చేశాడు. తాజాగా మరో సెన్సేషన్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
బిగ్ బాస్ హౌజ్ లోకి నందమూరి నటసింహం బాలయ్య బాబు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ‘పైసా వసూల్ ’ సినిమా ప్రమోషన్ కోసం బాలకృష్ణ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కనుక జరిగితే నందమూరి అభిమానుల ఆనందానికి అడ్డుకట్ట వేయడం అసాధ్యం.
ఇక బాలయ్య, ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయనే రూమర్స్ కూడా అసత్య ప్రచారాలుగా మిగిలిపోవడం ఖాయం. సెప్టెంబర్ 1న విడుదల కానున్న పైసా వసూల్ సినిమా ప్రమోషన్ కోసం నందమూరి బాలయ్య బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తే ఎపిసోడ్ టీఆర్ పి రేటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.