ఈ మద్య తెలుగు బుల్లి తెరపై స్టార్ హీరోల హవా కొనసాగుతుంది.  ఇప్పటికే అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచింది.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన ‘బిగ్ బాస్’ షో ఇప్పుడు తెలుగు బుల్లి తెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
Related image
మొదట్లో బిగ్ బాస్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని ప్రేక్షకులు..శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ చేస్తున్న సందడికి బాగా ఆకర్షితులయ్యారు.  ఇక బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్ల మద్య వస్తున్న టాస్క్ లు, ఎలిమినేషన్, టాలీవుడ్ సెలబ్స్ రానా, తాప్సి, దేవరకొండ విజయ్ సందడి చేయడం జరిగింది.   దీంతో బిగ్ బాస్ టీఆర్ పీ రేంటింగ్ కూడా బాగానే పెరిగిపోయింది.  అంతే కాదు ఈ ముగ్గురు నటించిన సినిమాలు మంచి విజయం సాధించాయి.
Image result for jr big boss house
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని  కింగ్ నాగార్జున్ తెగ మెచ్చుకుంటున్నారు.  వెండి తెరపై నటించడం వేరు..బుల్లి తెరపై వ్యాఖ్యాతగా వ్యవహరించడం వేరు అన్నారు నాగార్జున. ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసినా..బుల్లి తెరపై 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి వ్యాఖ్యాత వ్యవహరించడం అనేది కాస్త కత్తిమీద సాము లాంటిదే అన్నారు.
Image result for jr big boss
 టీవీ వ్యాఖ్యాతగా ప్రేక్షకులను మెప్పించడం ఎంత కష్టమన్నది తనకి తెలుసునని నాగార్జున అన్నారు.  గత కొన్ని రోజులుగా 'బిగ్ బాస్' షో చూస్తున్నాననీ, ఎన్టీఆర్ చాలా బాగా చేస్తున్నాడని చెప్పారు. ఎన్టీఆర్ బయట ఎంత ఎనర్జీతో ఉంటాడో .. బుల్లితెరపై కూడా అంతే ఎనర్జీతో కనిపిస్తున్నాడని అన్నారు.  ఎంతో సమయస్ఫూర్తితో .. సమర్థతతో ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తోన్న తీరు అభినందనీయం అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: