తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి తనయుడు తనికెళ్ల తేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ లవంగం’.  ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రముఖ కన్నడ నటి సింధూ తాను కోరుకున్న ప్రియుడితో పెళ్లి పీటలెక్కింది.  'మిస్టర్ లవంగం' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సింధు.. తర్వాత కన్నడ సినీరంగంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించింది.

 కన్నడంలో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన సింధూ ఓ మల్టీ నేషనల్ కంపెనీలో  హెచ్ఆర్ మేనేజర్ గా పని చేస్తున్న శ్రేయస్ కోడియాళ్ వివాహమాడింది.  
Image result for kannada actress sindhu marriage
వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: