పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’  సినిమాకు రూట్ క్లియర్ అవడంతో ఇక పవన్ నటించబోయే ‘గబ్బర్ సింగ్-2’ పై మీడియా ద్రుష్టి పడింది. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ ఈ సినిమాను పక్కకు పెడుతున్నాడు అని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ టైటిల్ పై రకరకాల వివాదాలు రావడం, ఈ టైటిల్ రాయల్టీ కింద బాలీవుడ్ నిర్మాణ సంస్థలు కోట్లాది రూపాయలు డిమాండ్ చేయడం ఇవన్నీ పవన్ కు చికాకు తెప్పిస్తున్నాయాట.

అదీకాకుండా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు సంపత్ నంది రూపొందించిన ఫైనల్ స్క్రిప్ట్ కూడా పవన్ కు ఏమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. ఇదే సందర్భంలో సంపత్ నంది ని తప్పించి ఈ సినిమాకు దర్శకుడిగా మెహర్ రమేష్ ను పెట్టుకుందామని పవన్ కళ్యాణ్ కు ఆలోచన వచ్చినా, ఈఆలోచనకు షాక్ అయిన పవన్ సన్నిహితులు గగ్గోలు పెట్టడంతో ఆ ఆలోచన కూడా పవన్ విరమించుకున్నాడట. అదీ కాకుండా సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్-2’  సినిమాకు బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ గా నిలవకపోవడంతో సెంటిమెంట్ గా ఈ సినిమాను చేయవద్దని పవన్ కు సలహాలు వస్తున్నాయట.

టాలీవుడ్ లో సీక్వెల్స్ కు కలిసిరాక పోవడం ఇలా రకరకాల సెంటిమెంట్స్ తో ఇన్ని వ్యతిరేక పరిస్థితులాలో తనకు కూడా పూర్తిగా నచ్చని స్క్రిప్ట్ ను సినిమాగా ఎందుకు తియ్యాలి అనే తలంపు రావడంతో పవన్ తన ‘గబ్బర్ సింగ్-2’ ఆలోచనను అటకెక్కించినట్లు చెపుతున్నారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల తరువాత మాత్రమే పవన్ నటించబోయే సినిమా విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అప్పటి దాకా ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: