తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మెగా, నందమూరి, అక్కినేని ఫ్యామిలీ హీరోల హవా కొనసాగుతుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు బాలకృష్ణ తర్వాత ఆ రేంజ్ మాస్ ఇమేజ్ సంపాదించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ పాత్రల్లో ముఖ్యంగా జై పాత్ర పూర్తి స్థాయిలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడట.
లవ, కుశ రెండు పాత్రలు ఫన్నీ, ఎమోషనల్ సీన్లతో దుమ్మురేపినట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న నందమూరి కళ్యాన్ తన తమ్ముడు ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తున్నాడు. జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ లా ఏ హీరో కూడా నటించలేడని , అలా నటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
అంతే కాదు ఎన్టీఆర్ ని ఉద్దేశించి నాన్నా..నువ్వు ఏం టేన్షన్ పడొద్దు..ఈ సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాపై ఫస్ట్ నుంచి కళ్యాన్ రామ్ ఎన్నో అంచనాలు వేస్తూ వచ్చారు..అంతే కాదు సినిమాలో దర్శకత్వంలో కొన్ని సీన్లు కూడా మార్పులు చేర్పులు చేసినట్లు టాక్ వచ్చింది.
ఇక సినిమా విషయానికి వస్తే.. జై క్యారెక్టర్ లో ఎన్టీఆర్ రెచ్చిపోయి నట విశ్వరూపం చూపించాడని ఊహాగానాలు వస్తుండటం తో జై పాత్రని ఎన్టీఆర్ తప్ప ఎవరూ చేయలేరని కామెంట్ చేయడం కొంత వివాదం అవుతోంది. ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మంచి నటులే అయినప్పటికీ ఈ విషయాన్ని తమకు తామే డబ్బా కొట్టుకుంటూ..ఇతర హీరోలను కించ పర్చినట్లు మాట్లాడటంపై మిగతా హీరోల అభిమానులు ఫీల్ అవుతున్నారు.