తెలుగు ఇండస్ట్రీలో రియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న దివంగత హీరో శ్రీహరి సతీమణి డిస్కో శాంతి మేనకోడలు చెన్నైలో అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.   చైన్నైలోని టీనగర్‌లో లలిత కుమారి, డిస్కోశాంతిల సోదరుడు, సహాయ దర్శకుడైన అరుణ్‌ మొళివర్మన్ కుటుంబం నివాసం ఉంటున్నారు. ఈయన కుమార్తె అబ్రిన్‌ నగరంలోని చర్చ్ పార్క్ స్కూల్‌లో ప్లస్ టూ చదువుతోంది.  ఈ నేపథ్యంలో అపర్ణ తల్లి సెరిల్, మేనత్త లలిత కుమారి (ప్రకాశ్ రాజ్ మొదటి భార్య) మీడియా ముందుకు వచ్చారు.

టి నగర్ లో ఉంటున్న అబ్రిన్ సెప్టెంబర్ 6న బయటకు వెళ్ళింది..ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తెలిసిన బంధు మిత్రుల ఇళ్లలో వాకబు చేసారు కానీ అబ్రిన్ జాడ తెలియకపోవడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు.   ఆ అమ్మాయి కోసం బంధువులు, స్నేహితులు, చైన్నైలోని వివిధ ప్రాంతాల్లో తిరిగినా ఆమె ఆచూకీ లభించలేదు.

దీంతో కుటుంబ సభ్యులు స్థానిక టీ.నగర్, పాండిబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదుచేశారు. పోలీసులు  అబ్రిన్‌ చదువుతున్న చర్చ్‌ పార్క్ స్కూల్‌లో విచారించారు. అలాగే ఆ పరిసరాల్లోని 56 సీసీ టీవీల పుటేజ్‌ను పరిశీలించారు.   

యుక్త వయసుకి వచ్చిన అమ్మాయి కావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మీడియా ద్వారా మా అమ్మాయి ఆచూకీ దొరకుతుందన్న ఆశతో మీ ముందుకు వచ్చినట్టు వారిద్దరూ బోరున విలపిస్తూ విలేకరుల వద్ద వాపోయారు. అబ్రిన్‌ తల్లి సెరిల్‌ మాట్లాడుతూ తమ బిడ్డ ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని కోరింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: