తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాలలో యంగ్టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా ఒకటి. ఈ దసరాకు మహేష్బాబు స్పైడర్ సినిమాకు పోటీగా వస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.
ఇక ఈ సినిమా గురించి అదిరిపోయే బజ్ ఉన్నా సినిమా రన్ టైం మాత్రం కాస్త టెన్షన్ పెడుతోంది. ఈ సినిమా టోటల్ రన్ టైం 155 నిమిషాలుగా మ్యాటర్ లీక్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్లో వస్తోన్న సినిమాల రన్ టైం మహాఅయితే 130-140 నిమిషాల మధ్యే ఉంటోంది. అయితే అర్జున్రెడ్డి లాంటి సినిమాలు 3 గంటలు (180 నిమిషాలకు పైగా) ఉన్న రన్ టైంతో వచ్చినా సక్సెస్ అయ్యాయి.
దీనిని బట్టి కథా బలం ఉంటే ప్రేక్షకుడికి రన్ టైంతో సంబంధం ఉండదని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేస్తుండడంతో పాటు కథాబలం ఉన్న సినిమా కావడంతో 155 నిమిషాల రన్ టైం ఫిక్స్ చేయకతప్పలేదంటున్నారు. మరి రిలీజ్క్ ముందే ఎన్టీఆర్ కెరీర్లో ఏకంగా రూ.112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఈ నెల 14న సెన్సార్కు వెళుతోంది.