అక్రమ సంబంధాల దందాలు ఈ మధ్యకాలం లో విపరీతంగా పెరిగిపోయాయి , అవి ఎంతవరకూ తెగబడుతున్నాయి అంటే సొంత పిల్లలని కూడా చంపుకునే వరకూ నడుస్తోంది పరిస్థితి.


భార్య నుంచి విడిపోయిన ఒక భోజ్ పురీ హీరో ఆమె మీద ఏదో రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నాడు, అప్పటికే ప్రియురాలు తో బతుకుతున్న అతను ఆమె సహాయం తో కొడుకుని కిడ్నాప్ చేసాడు. ఈ వ్యవహారం అంతా డిల్లీ లో జరిగింది . డిల్లీ లోని లక్ష్మీ నగర్ లో భోజ్ పూరి సినిమాల్లో హీరోగా నటించే మహమ్మద్ షాహీద్ ఉంటున్నాడు.


అతనికి ముస్కాన్ అనే భార్య ఉందిషహనాజ్ అనే రెండేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. వీరిద్దరి మధ్యనా ఏర్పడిన గొడవల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈలోగా ముస్కాన్ వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. షహీద్ కూడా సునయన శర్మ అలియాస్ ఆలీషా అనే యువతి తో సహజీవనం చేస్తున్నాడు.


 కోర్టు ఆదేశాల మేరకు షెహనాజ్ తల్లి సంరక్షణలో ఉండగా, అతన్ని అప్పుడప్పుడూ చూసేందుకు షాహిద్ కు అనుమతి ఉంది. అయితే, కుమారుడిని చూసేందుకు షాహిద్ ను ముస్కాన్ అనుమతించడం లేదు. ఆమె మీద కోపం తో ప్రతీకారం తీర్చుకోవాలి అని ఏకంగా కొడుకునే కిడ్నాప్ చేసాడు మనోడు , ప్రియురాలు దీనికి సహాయం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: