తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగుని రీతిలో అలనాటి మహానటి సావిత్రి బయోస్కోపిక్ చిత్రం రాబోతుంది.  ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక సినియర్ నటిపై సినిమా తీయడానికి ఎవరూ సాహసించలేదు.  మొట్టమొదటి సారిగా ‘ఎవడే సుబ్రమాణ్యం’ చిత్రం దర్శకులు  నాగ అశ్విన్  సావిత్రి జీవితకథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు.  
Image result for mahanati
అయితే ఇందులో సావిత్ర పాత్ర కోసం మళియాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ని తీసుకోగా ఇతర పాత్రల్లో సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మద్య  ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న షాలిని పాండే ని కూడా తీసుకున్నారు.   నాగ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.  
Image result for mahanati
తాజాగా ఈ చిత్రంలో మరో అందాల హీరోయిన్ నాగ అశ్విన్ తొలి ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవికా నాయర్ ‘మహానటి’లో  గెస్ట్ రోల్ లో నటించనుందట.  ఈ పాత్ర  నిడివి తక్కువే అయినా.. సినిమా కు ఎంతో కీలకంగా మారనుందట.  ఇప్పటికే తెరనిండుగా అందాల తారలతో కనిపిస్తున్న ‘మహానటి’ లో ముందు ముందు ఇంకెంత మంది తారలు తళుక్కుమంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: