మురుగదాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న స్పైడర్ సినిమా 27 న విడుదల కి సిద్దమవుతోంది. మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ని రేపు సాయంత్రం విడుదల చేస్తారు.


ట్రైలర్ రిలీజ్ కి ఒక ప్రోగ్రాం కూడా ఏర్పాటు చెయ్యబోతున్నారు. అయితే అదే రోజున జై లవ కుశ టీం ఈ ట్రైలర్ కి పోటీగా జై లవ కుశ లోంచి ఒక సాంగ్ ని విడుదల చెయ్యబోతోంది.


ఈ సాంగ్ కేవలం సాధారణమైన సాంగ్ అయితే పర్లేదు కానీ తమన్నా ఎన్టీఆర్ ల మధ్యన జై లవకుశ లో రాబోతున్న ఒక సూపర్ ఐటెం సాంగ్ అన్నమాట .. సో ఫాన్స్ అందరూ చాలా ఉత్సాహం తో ఉన్నారు.


బాక్స్ ఆఫీస్ దగ్గర వారం గ్యాప్ లో యుద్ధం ప్రకటించుకున్న తెలుగు హీరోలు మహేష్ బాబు ఎన్టీఆర్ లు ట్రైలర్ - ఐటెం సాంగ్ విషయం లో మాత్రం ఒక్క రోజులో పెద్ద యుద్ధం సెట్ చేసారు. రెండిటి మీదా ట్రెండ్ కోసం అప్పుడే మహేష్ - ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ లో సిద్ధం అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: