మరో మూడు రోజుల్లో నందమూరి ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ జై లవకుశ మూవీ రిలీజ్ కానుంది. ఆ నెక్ట్స్ వీక్ మహేష్ బాబు నటించిన స్పైడర్ విడుదల కానుంది. ఇద్దరూ టాలీవుడ్ స్టార్ హీరోలే. ఇద్దరి సినిమాలపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అలాంటి హీరోల సినిమాలు కాస్తంత గ్యాప్ లో విడుదల కావడం టెన్సన్ పెట్టే అంశమే.  


అయితే వీరి సినిమాలు పోటీపడటం ఇదే తొలిసారి మాత్రం కాదు. ఇది నాలుగవ సారి ఇద్దరూ ఢీకొట్టుకోవడం అవుతుంది. గతంలో మూడుసార్లు పోటీపడినప్పుడు రెండు సార్లు మహేష్ టాప్ లో నిలిచారు. మరి ఈ సారి ఎవరు పై చేయి సాధిస్తారో త్వరలో తేలిపోనుంది.


2003లో ఎన్టీఆర్ నాగ, మహేష్ ఒక్కడు రిలీజ్ అయ్యాయి. నాగా మూవీ నిరాశపర్చింది. మహేష్ నటించిన ఒక్కడు ఘన విజయాన్ని సాధించింది. తర్వాత  2010లో మహేష్ ఖలేజా, ఎన్టీఆర్ బృందావనం ఒకే సమయంలో పోటీ పడ్డాయి. అప్పుడు ఎన్టీఆర్ టాప్ లో నిలిచారు. 


మూడోసారి 2011లో ఎన్టీఆర్ ఊసరవెల్లి, మహేష్ దూకుడు పోటీ పడగా దూకుడు టాప్ పొజిషన్ లో నిలిచింది. ఇలా వీరిద్దరూ మూడు సార్లు పోటీ పడగా.. రెండుసార్లు మహేష్ బాబు పై చేయి సాధించారు. అయితే ఈసారి ఇద్దరి సినిమాలకు ఫుల్ హైప్ క్రియేట్ అయింది. రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఏ సినిమా విజయం సాధిస్తుంది అన్న విషయం మీద అందరి చూపు ఉంది. దసరా కింగ్ ఎవరు అనేది త్వరలోనే తేలిపోనుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: