సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా హర్రర్, థ్రిల్లర్ తో పాటు కామెడీ నేపథ్యంలో వస్తున్న చిత్రాలు చాలా వరుకు సక్సెస్ అవుతున్నాయి. ప్రముఖ దర్శకులు లారెన్స్ ముని చిత్రంతో ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. ఒకప్పుడు విఠలాచార్య చిత్రాల్లో దెయ్యాలు కామెడీ చేస్తే నవ్వలేక చచ్చేవారు..తర్వాత రాంగోపాల్ వర్మ దెయ్యం సిసిమాల్లో చూసి భయంతో కంపించిపోయేవారు. ఈ రెండూ మిక్స్ చేస్తూ లారెన్స్ హర్రర్ తో పాటు కామెడీ పండిస్తూ తీసిన ముని, కాంచన, గంగ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు హర్రర్, కామెడీ తో అలరించాయి..రీసెంట్ గా ఆనందో బ్రహ్మ కూడా ఈ తరహా చిత్రం కావడంతో మంచి విజయం సాధించింది. తాజాగా హర్రర్, కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. ఆది- వైభవి- రష్మి జంటగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఎలాంటి హంగామా లేని ఈ చిత్రం సైలెంట్గా షూటింగ్ పూర్తి చేసుకోవడం, ట్రైలర్ని రిలీజ్ చేయడం కూడా జరిగిపోయింది.
గత కొంత కాలంగా ఆదికి మంచి హిట్ సినిమాలు ఏవీ లేవు. ఆ మద్య వచ్చిన శమంతకమణి చిత్రం యావరేజ్ టాక్ వచ్చింది. ఇక చిత్రం విషయానికి వస్తే..నలుగురు సభ్యుల గల గ్యాంగ్ హోటల్ పెడితే ఏం జరిగింది..వారు తీసుకున్న బంగ్లాలో మనుషులు చనిపోతుంటారు..ఎందుకు అన్న విషయంపై సినిమా ఆద్యంతం కామెడీ, హర్రర్ గా కొనసాగుతుందని తెలుస్తుంది.
రెండున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్లో రష్మి కనిపించిన సీన్స్ చాలా హాట్ హాట్ గా ఉన్నట్లు తెలుస్తుంది..ఈ అమ్మడు నొప్పి అంటూ కొట్టే డైలాగ్ చూస్తుంటే మరోసారి రష్మి ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో తెలుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత రష్మి కనిపించడంతో అంచనాలు పెరిగాయి. కామెడీ హారర్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాని నవంబర్ 3న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.