మెగా ఫామిలీ కి సంబంధించి ఎలాంటి రూమర్ వచ్చినా వారి తరఫున సమాధానం చెప్పే స్పోక్ పెర్సన్ గా ఈ మధ్య కాలం లో నాగబాబు కనిపిస్తున్నారు. అప్పట్లో మీడియా లో కనపడడానికి సైతం ఇష్టపడని నాగబాబు గత ఐదేళ్ళ కాలం లో ఎక్కువగా మీడియా లోనే ఉన్నారు.

జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ తో జనాలకి బాగా చేరువైన నాగబాబు మెగా ఫామిలీ లో వివాదాలు అయినా, మంచి ఐన చెడు అయినా ఏదైనా మీడియాకి తన ద్వారానే తెలిసేలా చేస్తున్నారు. ఈ మధ్యన మీడియా తో ముచ్చటించిన ఆయన తన కూతురు నిహారిక , మేనల్లుడు సాయి ధరం తేజ ల మధ్యన వస్తున్న వార్తల మీద స్పందించారు.

ముక్కుసూటిగా తాను అనుకున్నది ఏంటో చెప్పేసే మనస్తత్వం ఉన్న నాగబాబు ఎక్కడా వెనక అడుగు వెయ్యకుండా మాట్లాడతారు. నిహారిక - సాయి ధరం తేజల పెళ్లి జరగబోతోంది అంటూ వార్తలు వస్తున్న నేపధ్యం లో ఆయన స్పందిస్తూ ' అదొక ఫూలిష్ న్యూస్ ' అనేసారు. " ఎవడో దరిద్రుడు ఆ న్యూస్ ని సృష్టించి ఉంటాడు.

పనీ పాటా లేనివాళ్ళు అలాంటి వార్తలు రాస్తూ ఉంటారు. కనీసం మాలాంటి వాళ్ళని అడిగి నిజం తెలుసుకుని రాయాలి అన్న జ్ఞానం కూడా ఉండదు వాళ్లకి " అన్నారు నాగబాబు. వాళ్లిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెళ్ల మాదిరిగా పెరిగారని అన్నారు. పనీపాటా లేని వాళ్లు సృష్టించే పుకార్లను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.        


మరింత సమాచారం తెలుసుకోండి: