తెలుగు ఇండస్ట్రీలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్య భరిత పాత్రల్లో నటించి తాజాగా బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ నిర్మాణ సారథ్యంలో ‘జై లవ కుశ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి చిత్ర కథ పై రక రకాల రూమర్లు పుట్టుకొస్తున్నా..కథ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు.
ఇక ‘జై’ పాత్రను చాలా వైలెంట్ గా చూపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ‘కుశ’ చేసే తుంటరి పనులు, ‘లవ’ అమాయకత్వంతోపాటు అతనిలో దాగివున్న చిలిపితనాన్ని గురించి చూపించారు. అయితే ఈ మద్య జై లవ కుశ చిత్రంపై రక రకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి. జై లవ కుశ. కె.ఎస్ రవింద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్న తారక్ సినిమాకు అన్నితానై ఉండి నడిపిస్తున్నాడట.
ఇక ఈ మూడు పాత్రలకు సంబందించిన ఫినిషింగ్ విషయంలో తారక్ చాలా కేర్ తీసుకుంటున్నాడట. తాజాగా దీనిపై స్పందించిన ఎన్టీఆర్ ఒకవేళ ఈ సినిమాకు తానే దర్శకత్వ వహించాలనుకుంటే తన పేరు స్క్రీన్ పై ఖచ్చితంగా వేయించుకునేవాడిని.. అలా చేస్తే తనని ఎవరు అడుగుతారంటూ ప్రశ్నించారు.
కాకపోతే కథ విషయంలో మరింత రక్తి కట్టే విధంగా కొన్ని సలహాలు మాత్రమే ఇచ్చానని..దర్శకత్వం బాబీ తనదైన శైలిలోనే తీశారని అన్నారు. దర్శకత్వం జోలికి తాను వెళ్లలేదని ఎన్టీఆర్ చెప్పారు. అంతే కాదు సినిమా హిట్ అయితే దర్శకుడిగా ఆ క్రెడిట్ దక్కేది ఆయనకేనని స్పష్టం చేశారు.