బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. అలనాటి మహానటులు ఫృథ్విరాజ్ కపూర్ నుంచి నేటి తరం హీరో రణబీర్ కపూర్ వరకు ఎంతో మంది ఇండస్ట్రీలో నటులుగా, దర్శకులు, నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక రణదీర్ కపూర్ కూతుళ్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ లు హీరోయిన్లుగా సత్తా చాటారు. బాలీవుడ్ లో రాజ్ కపూర్ ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించడమే కాకుండా నిర్మించారు..దర్శకత్వం వహించారు. రాజ్ కపూర్ ఎంత గొప్ప నటులో అదే రేంజ్ లో వివాదాలు కూడా ఉన్నాయి.
రాజ్ కపూర్ నట వారసుడిగా ఆయన తనయుడు ప్రముఖ బాలీవుడ్ హీరో రిషికపూర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న ఆర్కే స్టూడియో కి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అగ్ని ప్రమాదం గురించి ప్రముఖ దినపత్రికలో వచ్చిన కార్టూన్పై నటుడు రిషి కపూర్ మండిపడ్డారు. కార్టూన్ విషయానికి వస్తే..ఆర్కే స్టూడియో దగ్ధమవుతుండగా పై నుంచి రాజ్ కపూర్ చూస్తూ `అగ్ని మంచి సంకేతమే.. నా జీవితం మలుపు తిరిగిందే.. ఆగ్ (అగ్ని) వల్ల` అంటున్నట్లుగా చూపించారు.
రాజ్ కపూర్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో తన ఆర్ కే స్టూడియోని నిర్మించారు. ఈ స్టూడియోలో ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన మొదటి సినిమా `ఆగ్ (అగ్ని)`. అలాంటి గొప్ప నటుడిని ఓ ప్రమాదాన్ని చూసి నవ్వుతున్నట్లుగా చూపించడమై రిషి కపూర్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ కె స్టూడియో కి అగ్ని ప్రమాదం జరిగిన రోజు కూడా రిషి కపూర్ ట్విట్ చేశారు.
చారిత్రాత్మక స్టేజీ 1 నాశనమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు` అని ట్వీట్ చేశారు. అలాగే `కావాలనుకుంటే మళ్లీ స్టూడియోను నిర్మించుకోవచ్చు. కానీ దానితో ఉన్న జ్ఞాపకాలను తిరిగి తీసుకురాలేం` అని రిషికపూర్ మరో ట్వీట్ చేశారు.