అసలు ఇలాంటి ఒక కాంబినేషన్ తెలుగు లో వస్తుంది అని మనం ఎప్పటికీ ఊహించం .. కానీ బోయపాటి శ్రీను మాత్రం దీన్ని నిజం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసారు. హీరో మహేష్ బాబు , సీనియర్ హీరో బాలకృష్ణ వీరిద్దరితో సినిమా తీయడం కోసం బోయపాటి శ్రీను మంతనాలు జరుపుతూ ఉన్నట్టు తెలుస్తోంది.


మహేష్ బాబు ఇప్పటికే స్పైడర్ రిలీజ్ హడావిడి తో పాటు భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో ఉండగా మహేష్ ని పర్సనల్ గా కలిసి ఒక లైన్ చెప్పారు బోయపాటి. పూర్తి యాక్షన్ ఫిలిం గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ తో పాటు బాలయ్య చేస్తే ఒక కొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుంది అని చెప్పారట బోయపాటి.


ఈ ఐడియా తో పాటు బొయపాటి చెప్పిన లైన్ కూడా మహేష్ కి విపరీతంగా నచ్చింది అనీ కానీ వంశీ పైడిపల్లి తో చెయ్యడానికి మాట ఇచ్చిన విషయం గుర్తు చేసాడు మహేష్.


ఆ సినిమా తరవాత దీని గురించి ఖచ్చితంగా ఆలోచిస్తా అన్నారట . మహేశ్ బాబుతో ఓ సినిమా చేసే ఛాన్స్ కోసం బోయపాటి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కనుక మహేశ్ ను కలిసి కథ చెప్పేసి ఉంటాడని అనుకోవచ్చు. కానీ ఆశ్చర్యపోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు హీరోలకి బోయపాటి ఒకే కథను చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య కి మాత్రం ఈ కథ మల్టీ స్టారర్ అని ఇంకా తెలీదు అంటున్నారు. సో ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే దుమ్ము దులిపెస్తారు ఫాన్స్ .

మరింత సమాచారం తెలుసుకోండి: