జై లవ కుశ .. ఎల్లుండే ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రొమొతిఒన్న ల కోసం తన వంతు ప్రమోషన్ లలో బిజీ గా ఉన్నాడు హీరో ఎన్టీఆర్. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన సినిమా అనుభవాలు పంచుకున్న ఎన్టీఆర్ జై పాత్ర కోసం తన ఓన్ స్టైల్ లో కష్టపడ్డా అని చెప్పుకొచ్చాడు.


రిఫరెన్స్ లు తీసుకోవడం తనకి ఇష్టం ఉండదు అనీ కొత్తగా ఒక పాత్ర చేస్తూ ఉన్నప్పుడు పూర్తిగా దానిమీద అవగాహన తెచ్చుకోవడం ముఖ్యం అన్నాడు ఎన్టీఆర్. మూడు పాత్రలు ఓకే సారి చేయవలసి రావడం వలన తనపై బాగా ఒత్తిడి పెరిగిందని చెప్పారు.


ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజమౌళి బాహుబలి తరవాత మహాభారతం మీద ఆసక్తి చూపిస్తూ ఉండడం తో ఈ టాపిక్ ఎన్టీఆర్ దగ్గర తీసుకువచ్చినప్పుడు " రాజమౌళి కంటే బాగా మహాభారతం ఎవ్వరు తీయగలరు ? ఆయన నిజంగా మహాభారతం తీస్తే గనక అందులో నాకు ఎలాంటి రోల్ ఇస్తారు అనేది ఆయనకంటే బాగా నాకు కూడా తెలీదు.


చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా అలాంటి ఒక ఎపిక్ సినిమాలో కనపడ్డం కోసం నేను సిద్ధం " అని ప్రకటించాడు ఎన్టీఆర్. ఈ ప్రాజెక్టును గురించిన ప్రచారం మాత్రమే జరుగుతుంది కనుక, ఈ సినిమా గురించి రాజమౌళి మాట్లాడితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: